Haryana Assembly Elections: హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరు?
- హరియాణాలో కాంగ్రెస్ గెలిస్తే
- ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరిస్తారు?
- ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన మాజీ ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కూడా హస్తంకే జైకొట్టాయి. పార్టీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి అవకాశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని భూపిందర్ సింగ్ పునరుద్ఘాటించారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన తర్వాత హుడా ఈ వ్యాఖ్య చేశారు. రోహ్తక్లోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఎంపికపై మీరేమంటారు?
అనేక ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ విజయంపై హుడా మాట్లాడుతూ.. “మా అంచనా ప్రకారం, మేము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని నేను ఇప్పటికే చెప్పాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రశ్నకు హుడా, పార్టీలో ఒక సెట్ ప్రక్రియ ఉంది. దీని ప్రకారం పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని, ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
కుమారి సెల్జా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారా?
కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారా అని అడగ్గా.. హుడా స్పందిస్తూ.. “ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంతో తప్పు లేదు. ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని చెప్పే ప్రక్రియ ఉంది. ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.” అని తెలిపారు. ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను ఉటంకిస్తూ.. రాష్ట్రంలో మీరు ఏం చేశారని ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రిని మార్చారు. అయితే ప్రజలు ఏకంగా ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.. హర్యానాలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ‘పనికిరానిది’ అని పేర్కొన్న కాంగ్రెస్ నాయకుడు, ఈ ప్రభుత్వంలో అవినీతి, నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుందని, రైతులు, ఉద్యోగులు, పేదలు, కార్మికులు, మహిళలు, యువతతో సహా ప్రతి వర్గం విసిగిపోయారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!