Madhavaram Krishna Rao: ప్రజల సొత్తు ఎవరయ్య జాగిరి కాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి తెలిపిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
- హౌసింగ్ బోర్డు స్థలాలు అక్రమంగా వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించిన వైనం.
- మిగిలిన స్థలాలను కూడా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhavaram Krishna Rao: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి వహించారు. వసంత్ నగర్, కూకట్పల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మాధవరం కృష్ణారావు మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు స్థలాలు అక్రమంగా వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తు, అది ఎవరికి కూడా జాగిరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తుందని, ఇప్పుడు కూడా అదే జరగాలా? అని అన్నారు.
Also Read: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఆన్ ఫైర్.. 4 రోజుల్లో అన్ని కోట్లా?
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. 6 గజాల నుండి 30 గజాల స్థలాలను వేలం వేయడం దుర్మార్గంగా అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హౌసింగ్ బోర్డు స్థలాలను కాపాడి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించామని గుర్తుచేశారు. ఈ స్థలాలను, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా.. ఇప్పుడు మిగిలిన స్థలాలను కూడా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని, ఎవరైనా ఈ స్థలాలను కొనుగోలు చేస్తే.. వారిని ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటాం అని అన్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇంకా హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మాధవరం కృష్ణారావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read: Chennai : దారుణం.. కూతురితో వ్యభిచారం చేయిస్తూ వీడియోలను తీసిన తల్లిదండ్రులు
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!