KTR: బీజేపీ మోసం రాముడికి కూడా అర్థమైంది.. కరీంనగర్ ప్రజలు మాత్రం..!
- కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
- తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం
- బీజేపీ మోసం దేవుడు రాముడికి కూడా అర్థమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్లో ఒక్క బడి తేలేదు అని, కనీసం గుడి కూడా తేలేదని.. అయినా కరీంనగర్ వాసులు బీజేపీకే ఓటు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ మోసం దేవుడు రాముడికి కూడా అర్థం అయిందని, అందుకే అయోధ్యలో బీజేపీని ఓడగొట్టారని ఎద్దేవా చేశారు. అవసరం లేకున్నా వేసిన జీఎస్టీని తీసేసి పండుగ చేసుకోండి అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘బీజేపీ ప్రభుత్వం అవసరం లేకున్నా వేసిన జీఎస్టీని తీసేసి పండుగ చేసుకోండి అంటున్నారు. ప్రధాని మోడీ చెప్పినట్లు పదిహేను లక్షలు ఏమయ్యాయి. దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం ఒక్కటే బీజేపీకి తెలుసు. దేవుని పేరు చెప్పారని కరీంనగర్లో కూడా బీజేపీని గెలుపించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతున్నాం. కరీంనగర్లో ఒక్క బడి తేలేదు, కనీసం గుడి కూడా తేలేదు. అయినా కరీంనగర్ వాళ్లు బీజేపీకే ఓటు వేస్తున్నారు. బీజేపీ మోసం ఆ దేవుడు రామునికి కూడా అర్థం అయింది. అందుకే అయోధ్యలో బీజేపీని ఓడగొట్టారు. కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీనే గెలిపిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు.
Also Read
Also Read: IND vs BAN: జస్ప్రీత్ బుమ్రాకు నో రెస్ట్.. ఎవరికీ వెసులుబాటు లేదు!
‘కాంగ్రెస్ దొంగ మాటలు హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు. కానీ ఊళ్లలో నమ్మి మోసపోయారు. చాలా మంది మా ఎమ్మెల్యే ఓడిపోయినా.. కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారు. బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ ప్రబుత్వాన్ ఆగమాగం చేసింది’ అని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!