KTR: బీజేపీ మోసం రాముడికి కూడా అర్థమైంది.. కరీంనగర్ ప్రజలు మాత్రం..!
- కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
- తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం
- బీజేపీ మోసం దేవుడు రాముడికి కూడా అర్థమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్లో ఒక్క బడి తేలేదు అని, కనీసం గుడి కూడా తేలేదని.. అయినా కరీంనగర్ వాసులు బీజేపీకే ఓటు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ మోసం దేవుడు రాముడికి కూడా అర్థం అయిందని, అందుకే అయోధ్యలో బీజేపీని ఓడగొట్టారని ఎద్దేవా చేశారు. అవసరం లేకున్నా వేసిన జీఎస్టీని తీసేసి పండుగ చేసుకోండి అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘బీజేపీ ప్రభుత్వం అవసరం లేకున్నా వేసిన జీఎస్టీని తీసేసి పండుగ చేసుకోండి అంటున్నారు. ప్రధాని మోడీ చెప్పినట్లు పదిహేను లక్షలు ఏమయ్యాయి. దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం ఒక్కటే బీజేపీకి తెలుసు. దేవుని పేరు చెప్పారని కరీంనగర్లో కూడా బీజేపీని గెలుపించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతున్నాం. కరీంనగర్లో ఒక్క బడి తేలేదు, కనీసం గుడి కూడా తేలేదు. అయినా కరీంనగర్ వాళ్లు బీజేపీకే ఓటు వేస్తున్నారు. బీజేపీ మోసం ఆ దేవుడు రామునికి కూడా అర్థం అయింది. అందుకే అయోధ్యలో బీజేపీని ఓడగొట్టారు. కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీనే గెలిపిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు.
Also Read
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
Also Read: IND vs BAN: జస్ప్రీత్ బుమ్రాకు నో రెస్ట్.. ఎవరికీ వెసులుబాటు లేదు!
‘కాంగ్రెస్ దొంగ మాటలు హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు. కానీ ఊళ్లలో నమ్మి మోసపోయారు. చాలా మంది మా ఎమ్మెల్యే ఓడిపోయినా.. కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారు. బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ ప్రబుత్వాన్ ఆగమాగం చేసింది’ అని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!