KTR: సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పోయే ఖర్మ బీఆర్ఎస్ కు లేదు.. గతంలో లేదు.. ఇప్పుడు ఉండదన్నారు. తమ చెల్లెలిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు.. అలాంటి బీజేపీతో తాము కలుస్తామా? అని అన్నారు.
Chandrababu: నిజ జీవితంలో నా మిత్రుడు పవన్ గబ్బర్ సింగ్.. పవన్ పై చంద్రబాబు ప్రశంసలు
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డో…ఇంకో దివాణో ఇంకేదో మాట్లాడితే మీరు ఆగం కావొద్దని సూచించారు. తాను రేవంత్ రెడ్డిని దివాణే అంటున్నానన్నారు. రేవంత్ రెడ్డిని లంగా, దొంగ, లుచ్చగాడు అని తాను అనలేదన్నారు. గిటువంటి లత్కోర్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పరిపాలన అనేది పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. బూతులు మాట్లాడుడు కాదు కదా పరిపాలన అంటే.. తాము పరిపాలన బాగా చేశాం కనుకనే హైదరాబాద్ లో 16 సీట్లు వచ్చాయన్నారు. మీ ఎమ్మెల్యేకు తోడు ఎంపీని కూడా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
Sundar C: తల్లి కాలేదని చెప్పారు.. ఇంకో పెళ్లి చేసుకోమంది.. ఎన్నో బాధలు పడ్డాం!
హైదరాబాద్ లో మళ్లీ కరెంట్, నీటి కష్టాలు మొదలైయ్యాయని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పి మోసం చేసిండు.. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని చెప్పి మరి మోసం చేసిండని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులేనని విమర్శించారు. ఒకరు చేవెళ్ల, ఇంకొకరు హుజురాబాద్ నుంచి వచ్చారని తెలిపారు. ఎన్నికలు కాగానే వాళ్లు వెళ్లిపోతారు.. కానీ రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని అన్నారు. మిమ్మల్ని కోరెదొక్కటే.. బీఆర్ఎస్ కు 10-12 సీట్లు ఇవ్వండని కోరారు. మళ్లీ రాష్ట్రంలో ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..