KTR : హైకోర్టులో ఫార్ములా కేసు సంబంధించిన ప్రశ్నలు ఇవే..
- కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
- ఏసీబీ తరుఫున వాదనలు వినిపిస్తున్న AG సుదర్శన్
- ఇప్పటికే పూర్తయిన కేటీఆర్ తరుపు లాయర్ వాదనలు
- కేటీఆర్ తరుఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏసీబీ తరుఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ పైన నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు లాయర్ సిద్ధార్థ్ దవే కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం బదిలీ అయిన డబ్బు FEO కు చేరింది.. 55 కోట్ల బదిలీ లో ఎక్కడా అవినీతి జరగలేదని, ఎలక్షన్ కోడ్ కు ముందే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అగ్రిమెంట్ జరిగిందని.. దీనికి ఎన్నికల నిబంధనలు వర్తించవు
కేటీఆర్ తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. పాలసీ నిర్ణయాలకు మాత్రమే ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయని కోర్టుకు తెలిపారు లాయర్. ఈ కేసులో కేటీఆర్ A1 గా చేర్చినప్పుడు FEO ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సిద్ధార్థ్ దవే ప్రశ్నించారు.
Komatireddy Venkat Reddy : నల్గొండ ప్రజల దశాబ్దాల కల SLBC
Also Read
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు .. కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని AG సుదర్శన్ రెడ్డి వాదించారు. మూడు దఫాలుగా నగదు బదిలీ చేశారని, 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చిందని, ఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది హైకోర్టు.
ఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని న్యాయస్థానం ప్రశ్నించడంతో.. కేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయని ప్రభుత్వ తరుపు న్యాయ వాది తెలిపారు. నిబంధనలు ఎలా ఉల్లంఘించారు అది చెప్పండని, ఈ ఫార్ములా కేసులో ఎలాంటి విధివిధానాలు ఫాలో కాలేదో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించడంతో.. ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతులు పొందలేదని, HMDAగా పార్టీ కానప్పుడు FEO కు డబ్బులు ఎలా చెల్లిస్తుందని, అనుమతులు లేకుండానే FEO సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని, ఇలా నగదు బదిలీ చేయడం వల్ల 8 కోట్లు హెచ్ఎండిఏకు అదనపు భారం పడిందని, మునిసిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందన్నారు ప్రభుత్వం తరుపు లాయర్. అయితే.. వాదనలు ముగిసిన అనంతరం.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అంతేకాకుండా.. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం తెలిపింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!