KTR: అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో ఉన్న ఒక చవకబారు మంత్రి తన పరిధిలోని పోలీసులను ఉపయోగించుకుని ప్రజాప్రతినిధులపై ఈ తరహా కేసులు పెట్టించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఓ ట్వీట్ చేశారు. “తెలంగాణ చవకబారు మంత్రి, అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద జరిగిన గొడవ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తన పోలీసులతో లైంగిక వేధింపుల కేసు నమోదు చేయించారు!!! చట్టాన్ని దిగ్భ్రాంతికరంగా దుర్వినియోగం చేయడం. ఈ పనికిమాలిన కేసులను మేము తప్పకుండా న్యాయస్థానంలో ఎదుర్కొంటాం. కానీ తెలంగాణడీజీపీ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను. హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులపై మిస్ ఇంగ్లాండ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల సంగతేంటి? తెలంగాణపోలీసులు నిందితులను కాపాడటం కొనసాగిస్తారా? రాహుల్ గాంధీ గారూ, ఏమైనా సమాధానాలు ఉన్నాయా?” అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of law
We of course will fight this rubbish cases in court of law
But let me ask @TelanganaDGP Garu
Whatever happened to the sexual harassment allegations of Miss England against Congress leaders who misbehaved with her during the Miss World contest in Hyderabad?
Will the @TelanganaCOPs continue to shield the accused ?
Any answers Mr @RahulGandhi ?
— KTR (@KTRBRS) September 12, 2026

