KTR : రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
- రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
- గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్ట్ ఇచ్చాము
- గురుకులాలు ఆనాడు ఎలా ఉన్నాయి నేడు ఎలా ఉన్నాయి అని కళ్లకు కట్టినట్టు చూపువ్వాలని కేసీఆర్ అన్నారు
- రైతులపై దాడి చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటాం : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చే ప్రభుత్వం నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, అస్థిత్వంపై అవగాహన లేకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్య తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తుందని, ప్రజల ఆవేదనకు బీఆర్ఎస్ గొంతుకగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలను శాసనసభ, మండలిలో నిలదీస్తామని కేటీఆర్ ప్రకటించారు. గ్రామ పంచాయతీలలో నిధుల కొరతను ప్రశ్నిస్తూ, సర్పంచులు, మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి ద్వారా దేశంలో అత్యుత్తమ గ్రామాలుగా తెలంగాణ గ్రామాలు నిలిచినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు పల్లెల అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.
Sonia Gandhi: జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసిన సంస్థతో సోనియాగాంధీకి సంబంధం..
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
దళితబంధు కార్యక్రమం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకు చెల్లింపులు జరగలేదని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే, రైతుబంధు రెండో విడత నిధుల విడుదల ఆలస్యం రైతుల కష్టాలను పెంచిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు పెట్టి ప్రజలను మోసగించిందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, లక్ష కోట్ల బడ్జెట్ వంటి హామీలను అమలు చేయలేదని, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నట్టేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతి హామీపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, ప్రజల సమస్యలపై శాసనసభ, మండలిలో బలమైన గొంతు వినిపిస్తామని హామీ ఇచ్చారు. ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ ప్రత్యేకంగా దిశానిర్దేశం ఇచ్చారని, రాష్ట్ర ప్రజల ఆవేదనను ప్రభుత్వానికి ముక్కుసూటిగా వ్యక్తపరచేందుకు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Extra-Marital Affair: రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త.. భార్య ముందే ప్రియుడికి దేహశుద్ధి..!
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!