KTR : మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్, టీడీపీలదే
- మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్
- మూసీ సుందరీకరణ అనే పదం వాడిందే సీఎం రేవంత్ రెడ్డి
- ఢిల్లీకి మూటలు పంపడం కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టారు
- చేయని సర్వేను చేసినట్టు రేవంత్ అబద్ధాలు చెప్పారు
- మూసీ విషయంలో సీఎం రేవంత్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసీ ప్రక్షాళన పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఢిల్లీకి మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ అని, నోట్ల రద్దు సమయంలో మోడీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని, లక్షన్నర కోట్లు ఖచ్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డినే అని కేటీఆర్ అన్నారు. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదని, తన చేసిన పాపం బయటకి రావటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడ్తున్నాయన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు.
Samsung Galaxy A16 5G: శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. అదిరిపోయిన ఫీచర్లు
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
జాతీయ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ.. ఏటీఎంలా మారిందని, మూసీ సుందరీకరణ చేయాలంటే, లక్ష మంది నిరాశ్రయులవుతారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మూసీని సుందరీకరణ చేయాలనుకున్నామని, లక్షల మంది పొట్ట కొట్టదని కేసీఆర్ సూచించారన్నారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా రివర్ బెడ్ లోనే ఉన్నాయని, బఫర్ జోన్ లో ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందన్నారు. ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టకుండా.. నాగోల్, ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో మూసీని సుందరీకరించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ వలనే హైదరాబాద్ రోడ్లపై నీరు నిలవటం లేదని ఈటల రాజేందర్ కూడా అన్నారని, కాళేశ్వరం నీళ్ళను గండిపేటకు జోడించటానికి ప్లాన్ చేశామన్నారు కేటీఆర్. అంతేకాకుండా.. మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్ టీడీపీలదే అని ఆయన ధ్వజమెత్తారు. మూసీకి పురిట్లోనే రేవంత్ రెడ్డి ఉరేసే ప్రయత్నం చేస్తున్నారని, మానవీయ కోణంలో మూసీని శుద్ది చేయాలనుకున్నామన్నారు. పేదల ఇళ్ళు కొట్టాలని మేము అనుకోలే అని, ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. నల్లగొండ మంత్రులు విషయం తెలసుకుని మాట్లాడాలన్నారు కేటీఆర్.
Meta Platform: కంపెనీ తినడానికి డబ్బులిస్తే.. వైన్ గ్లాసులు కొన్నారు.. కట్ చేస్తే జాబ్ గోవింద?
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!