KTR : మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్, టీడీపీలదే
- మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్
- మూసీ సుందరీకరణ అనే పదం వాడిందే సీఎం రేవంత్ రెడ్డి
- ఢిల్లీకి మూటలు పంపడం కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టారు
- చేయని సర్వేను చేసినట్టు రేవంత్ అబద్ధాలు చెప్పారు
- మూసీ విషయంలో సీఎం రేవంత్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసీ ప్రక్షాళన పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఢిల్లీకి మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ అని, నోట్ల రద్దు సమయంలో మోడీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని, లక్షన్నర కోట్లు ఖచ్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డినే అని కేటీఆర్ అన్నారు. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదని, తన చేసిన పాపం బయటకి రావటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడ్తున్నాయన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు.
Samsung Galaxy A16 5G: శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. అదిరిపోయిన ఫీచర్లు
Also Read
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. 'జొనాథన్ డేవిడ్' హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
జాతీయ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ.. ఏటీఎంలా మారిందని, మూసీ సుందరీకరణ చేయాలంటే, లక్ష మంది నిరాశ్రయులవుతారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మూసీని సుందరీకరణ చేయాలనుకున్నామని, లక్షల మంది పొట్ట కొట్టదని కేసీఆర్ సూచించారన్నారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా రివర్ బెడ్ లోనే ఉన్నాయని, బఫర్ జోన్ లో ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందన్నారు. ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టకుండా.. నాగోల్, ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో మూసీని సుందరీకరించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ వలనే హైదరాబాద్ రోడ్లపై నీరు నిలవటం లేదని ఈటల రాజేందర్ కూడా అన్నారని, కాళేశ్వరం నీళ్ళను గండిపేటకు జోడించటానికి ప్లాన్ చేశామన్నారు కేటీఆర్. అంతేకాకుండా.. మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్ టీడీపీలదే అని ఆయన ధ్వజమెత్తారు. మూసీకి పురిట్లోనే రేవంత్ రెడ్డి ఉరేసే ప్రయత్నం చేస్తున్నారని, మానవీయ కోణంలో మూసీని శుద్ది చేయాలనుకున్నామన్నారు. పేదల ఇళ్ళు కొట్టాలని మేము అనుకోలే అని, ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. నల్లగొండ మంత్రులు విషయం తెలసుకుని మాట్లాడాలన్నారు కేటీఆర్.
Meta Platform: కంపెనీ తినడానికి డబ్బులిస్తే.. వైన్ గ్లాసులు కొన్నారు.. కట్ చేస్తే జాబ్ గోవింద?
తాజావార్తలు
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
ట్రెండింగ్
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..