KTR Case: హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ.. ఏసీబీ కేసుపై లంచ్మోషన్ పిటిషన్
- హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ
- ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్మోషన్ పిటిషన్
- ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్
- కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు
- కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు- లాయర్
- రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారు- లాయర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR case trial in High Court.. Lunch motion petition on ACB case: హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవని లాయర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారంటూ లాయర్ తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్కు ప్రయోజనమే కలిగిందని లాయర్ అన్నారు. స్పాన్సర్ తప్పుకోవడం వల్ల హెచ్ఎండీఏ ద్వారా FEO కు చెల్లింపులు జరిగాయని కేటీఆర్ లాయర్ కోర్టుకు చెప్పారు.
Read Also: Atul Subhash Case: మనవడి కోసం సుప్రీంకోర్టుకి అతుల్ సుభాష్ తల్లి..
Also Read
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
- Telangana Exhibitors : ఆ 'జీవో 77' రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
KTR పై ఏసీబీ తప్పుడు కేసు నమోదు చేసిందని కేటీఆర్ లాయర్ ఆర్యమా సుందరం కోర్టుకు తెలిపారు. 14 నెలల తర్వాత కేసు నమోదు చేయడంలోనే రాజకీయ కుట్ర అని అర్థమవుతుంది.. కరప్షన్ జరగనప్పుడు పీసీ యాక్ట్ కేటీఆర్ కు ఎలా వర్తిస్తుందని లాయర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు.. ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఈ నిర్ణయం జరిగిందని లాయర్ తెలిపారు. ఈ ఏడాది 2024లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయి.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ద్వారా హైదరాబాద్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.700 కోట్ల లాభం జరిగిందని లాయర్ పేర్కొన్నారు.
Read Also: Janaki vs State of Kerala: తెలుగులోకి మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా
కాంగ్రెస్ ప్రభుత్వం FEO కు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందని లాయర్ చెప్పారు. 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే FEOకి చెల్లించారన్నారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని అన్నారు. పబ్లిక్ సర్వెంట్ నేర పూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలి.. కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్లో క్రిమినల్ మిస్ కాండక్ట్ నేర (పూరిత దుష్ప్రవర్తన) ఎక్కడ జరగలేదన్నారు. 13(1)a, 409 అనే సెక్షన్లు వర్తించవని కేటీఆర్ లాయర్ తెలిపారు.
తాజావార్తలు
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!