KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాన్సువాడలో మరోసారి గులాబీ జెండా ఎగరేసే సమయం వచ్చిందని ఆయన అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచి పార్టీ మారారని, ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగోలేదని ఆయనకు అర్థమైందన్నారు. “కుడితిలో పడిన ఎలుకలా పోచారం పరిస్థితి తయారైంది. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా ఆయన ఓడిపోవడం ఖాయం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పార్టీ మారను” అని చెప్పిన పోచారం చివరకు మాట తప్పి పార్టీ మారారని ఆరోపించారు. స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకునే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. పోచారం తన రాజకీయ భవిష్యత్తును తానే సమాధి చేసుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా చేతులెత్తేశారని ఆరోపించారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి కూడా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏ సభ పెట్టినా కేసీఆర్ను విమర్శించడమే సీఎం పనిగా మారిందన్నారు.
Also Read
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
- CJP Protest: ‘ఛలో పార్లమెంట్’ ఉద్యమంలో కీలక పరిణామం..
- Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, షాపుల్లో ఎరువుల సంచులు లేకపోతే యాప్లో కనిపించినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీకి పంపేందుకు సంచులు ఉంటున్నాయని, కానీ రైతులకు మాత్రం అందడం లేదని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కేటీఆర్ స్పందించారు. రెండు పిల్లర్లు కుంగి 31 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మరమ్మతులు ఎందుకు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కన్నెపల్లి నుంచి ప్రతిరోజూ నీరు కిందకు వెళ్తున్నా పంపింగ్ చేయడం లేదన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్కు వెళ్తే ప్రభుత్వం మాత్రం “కోల్డ్ స్టోరేజ్”లోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం అవసరమైతే రక్తమే కాదు ప్రాణాలు కూడా ఇస్తామని బీఆర్ఎస్ ఎప్పుడూ చెప్పిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
-
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
-
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి మరో సర్ప్రైజ్.. యష్తో ఈసారి తారా సుతారియా రొమాన్స్!
ట్రెండింగ్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!