కృష్ణాజిల్లాలో గన్నవరం వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ పి.జాషువా. గన్నవరం సంఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో టిడిపి వైసిపి శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో టిడిపి శ్రేణులు చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసువారి అనుమతులు లేవు. తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి, విధులు నిర్వహిస్తున్న పోలీసులు మీద దాడికి పురి గొల్పడం బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం తో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమై, జరిగిన ఘర్షణ లో విధులు నిర్వహిస్తున్న గన్నవరం సిఐ కనకారావు తలకు బలమైన గాయమైంది. పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందన్నారు.
Read Also: MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలుగు దేశం పార్టీ ఆఫీసు పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం.సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ ఆక్ట్ అమలు.ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాలలో ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్ట్ లు, పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు.
మరోవైపు టీడీపీ నేత పట్టాభి భార్య పోలీసులపై ఫైర్ అయ్యారు. నిన్న పట్టాభి ని అరెస్టు చేశారు…పోలీసుల నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు…నా భర్త ఎక్కడున్నారనేది ఇంతవరకు తెలియలేదు..మేము మా కురుంబా సభ్యులు ఆందోళన చెందుతున్నాము…నేను డిజిపి కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేస్తానన్నారు. డిజిపి కార్యాలయానికి బయలుదేరిన పట్టాభి భార్యను అడ్డుకుని ఇంట్లోకి తరలించారు పోలీసులు. గన్నవరంలో ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాదు నుంచి మచిలీపట్నం వెళుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రని చిల్లకల్లు టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన్ని విజయవాడ తరలించారు జగ్గయ్యపేట పోలీసులు.
Read Also: Dada Saheb Phalke Awards 2023: అవార్డు విజేతలు వీళ్లే…