SP P.JOSHUA: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లాలో గన్నవరం వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ పి.జాషువా. గన్నవరం సంఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో టిడిపి వైసిపి శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో టిడిపి శ్రేణులు చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసువారి అనుమతులు లేవు. తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి, విధులు నిర్వహిస్తున్న పోలీసులు మీద దాడికి పురి గొల్పడం బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం తో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమై, జరిగిన ఘర్షణ లో విధులు నిర్వహిస్తున్న గన్నవరం సిఐ కనకారావు తలకు బలమైన గాయమైంది. పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందన్నారు.
Read Also: MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
తెలుగు దేశం పార్టీ ఆఫీసు పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం.సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ ఆక్ట్ అమలు.ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాలలో ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్ట్ లు, పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు.
మరోవైపు టీడీపీ నేత పట్టాభి భార్య పోలీసులపై ఫైర్ అయ్యారు. నిన్న పట్టాభి ని అరెస్టు చేశారు…పోలీసుల నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు…నా భర్త ఎక్కడున్నారనేది ఇంతవరకు తెలియలేదు..మేము మా కురుంబా సభ్యులు ఆందోళన చెందుతున్నాము…నేను డిజిపి కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేస్తానన్నారు. డిజిపి కార్యాలయానికి బయలుదేరిన పట్టాభి భార్యను అడ్డుకుని ఇంట్లోకి తరలించారు పోలీసులు. గన్నవరంలో ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాదు నుంచి మచిలీపట్నం వెళుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రని చిల్లకల్లు టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన్ని విజయవాడ తరలించారు జగ్గయ్యపేట పోలీసులు.
Read Also: Dada Saheb Phalke Awards 2023: అవార్డు విజేతలు వీళ్లే…
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!