Kranti Gaud: కూతురుకు ప్రపంచకప్.. తండ్రికి పోలీస్ ఉద్యోగం!
- వన్డే ప్రపంచకప్ 2025 భారత మహిళల జట్టు సొంతం
- క్రికెటర్లకు రివార్డులు, అవార్డులు
- క్రాంతి గౌడ్ తండ్రికి పోలీస్ ఉద్యోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ 2025ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకుంది. కప్ గెలిచి వారం అవుతున్నా.. సంబరాలు మాత్రం ఇంకా ఆగలేదు. క్రికెటర్ల సొంత రాష్ట్రాలు ఘనంగా సత్కరిస్తూ.. రివార్డులు, అవార్డులు ప్రకటిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్లేయర్ క్రాంతి గౌడ్ను సత్కరించింది. అంతేకాదు క్రాంతి కోరిక మేరకు బర్తరఫ్ అయిన ఆమె తండ్రిని తిరిగి పోలీసుగా పునర్నియమిస్తామని మోహన్ యాదవ్ హామీ ఇచ్చారు.
2012లో ఎన్నికల విధుల సమయంలో క్రాంతి గౌడ్ తండ్రి మున్నా సింగ్ గౌడ్ ఓ పొరపాటు చేశారు. దాంతో కానిస్టేబుల్ అయిన ఆయనపై వేటు పడింది. అప్పటి నుంచి క్రాంతి కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. కొన్నిసార్లు తిండికి కూడా సరిగా ఉండేది కాదని గతంలో క్రాంతి చెప్పారు. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా క్రికెటర్గా కెరీర్ను కొనసాగించిన క్రాంతి.. భారత జాతీయ జట్టులో చోటు సంపాదించింది. దాంతో ఆమె కుటుంబం ఇబ్బందుల నుంచి బయటపడింది. ఇప్పుడు ఏకంగా వన్డే ప్రపంచకప్ గెలిచి కుటుంబానికి గౌరవాన్ని తెచ్చారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
తన తండ్రిని తిరిగి పోలీసుగా చూసుకోవాలనుకుంటున్నట్లు, గౌరవంగా రిటైర్ కావాలని కోరుకుంటున్నట్లు క్రాంతి గౌడ్ ఇటీవల చెప్పారు. చరిత్రాత్మక ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన క్రాంతిని ఆమె తల్లిదండ్రుల ఎదురుగా సీఎం మోహన్ యాదవ్ సన్మానించారు. క్రాంతి కోరిక తెలుసుకున్న సీఎం.. మున్నా సింగ్ను తిరిగి పోలీసు శాఖలో తీసుకుంటామని చెప్పారు. సీఎం హామీ ఇవ్వడంతో తనకు చాలా ఆనందంగా ఉందని క్రాంతి తెలిపారు. కొలంబోలో పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టు 88 పరుగుల తేడాతో గెలిపించడంలో క్రాంతి సహాయపడ్డారు. ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!