Koti Deepotsavam 2023 10th Day: ఇల కైలాసాన్ని తలపించిన రామభక్తి సామ్రాజ్యం.. ఘనంగా ఒంటిమిట్ట రామయ్య కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. దీపాల కాంతులతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తిలో మునిగిపోతున్నారు. రోజుకు ఒక కార్యక్రమంతో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపయజ్ఞంలో ప్రతీ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా.. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. ఇప్పటికే తొమ్మిది రోజుల పాటు సాగిన కోటిదీపోత్సవం వేదిక.. శ్రీరాముని రాకతో మరింత వెలుగులు నింపింది.
Tirumala: రేపు ఉదయం రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
Also Read
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
ఈరోజు కోటిదీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలు చూసుకుంటే.. ఎంతో చక్కగా ఇల కైలాసంలో రామభక్తి సామ్రాజ్యాన్ని తలపించింది. అంతేకాకుండా.. ఈ వేదికపై ఒంటిమిట్ట రామయ్య, కొండగట్టు అంజన్న సాక్షాత్కారం కన్నుల పండవగా సాగింది. సకలాభీష్టప్రదాయకం భక్తులచే ఆంజనేయస్వామికి కోటితమలపాకుల అర్చన కార్యక్రమం జరిపించారు. కమనీయం కడు రమణీయంలా శ్రీ ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కల్యాణం చూసి భక్తులు ఎంతో మైమరచిపోయారు. ఆ తర్వాత.. హనుమంత వాహనంపై జనకీరాముల వైభోగం నిర్వహించారు. ఇదిలా ఉంటే.. కంచి కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనభాగ్యం కల్పించారు. ఇస్కాన్ బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మహాభిషేకం చేశారు. ఇస్కాన్ విశాఖపట్నం మాతా నితాయి సేవని అనుగ్రహభాషణం జరిపించారు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం ఆలపించారు. వీటన్నింటితో పాటు అబ్బురపరిచే కళాసంబరాలు, అంబరాన్నంటే మహానీరాజనాలు ఎంతో ఘనంగా జరిగాయి. చివరకు కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులతో 10వ రోజు కోటి దీపోత్సవం ఘనంగా ముగిసింది.

Rani Rudrama: కేటీఆర్ను గద్దె దించి సిరిసిల్లలో నన్ను గెలిపించండి
ఇలా ఎన్నో విశేషాలకు వేదికైన కోటిదీపోత్సవానికి భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. భక్తులకు పూజా సామగ్రిని ఉచితంగా అందజేయడం జరుగుతోంది.. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే దీప యజ్ఞంలో పాల్గొనండి..
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!