Konda Murali: సీఎం, మాకు ఎలాంటి విభేదాలు లేవు.. సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా!
- మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం నాకేమీ తెలియదు
- రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ ఎంతో కష్టపడ్డాము
- మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటా
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి తెలిపారు. కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి తాను ఒక్కసారే వెళ్లాలని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ ఎంతో కష్టపడ్డామని.. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంతన్న అని పేర్కొన్నారు. సీఎం, తమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కొండా మురళి స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడొద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారని, మీనాక్షి అమ్మ చెప్పినట్లు తాను వింటానని చెప్పుకొచ్చారు.
సిమెంట్ కంపెనీ యాజమాన్యాలను కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను బాధ్యతల నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు సుమంత్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు రావడం, వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకోవడం జరిగింది. పోలీసులతో సుస్మిత వాగ్వాదం, ప్రశ్నలు అడగడంతో జూబ్లీహిల్స్లోని మంత్రి సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో హనుమకొండలో కొండా మురళి మీడియాతో మాట్లాడారు.
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
‘సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదు. కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాము. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంతన్న. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. ఈ రోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్తో ప్రోగ్రామ్ ఉంది. జరుగుతున్న పరిణామాలను తెలుసుకుని స్పందిస్తాను. కొండా సురేఖ హైదరాబాద్లో ఉన్నారు, ఈ రోజు వరంగల్ తూర్పులో సమావేశానికి హాజరవుతారు. ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, తప్పకుండా ఇస్తారు. కొండా సుస్మితతో ఇప్పుడే మాట్లాడాను. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది’ అని కొండా మురళి చెప్పారు.
‘అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. నేను మంత్రుల వద్దకు వెళ్తాను, సమస్య సమసిపోయేలా చూస్తాను. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను. పీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా’ అని కొండా మురళి తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?