Madhavi latha: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ఆస్తులెన్నో తెలుసా! ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా రికార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారంలోనూ.. మాటల్లోనూ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు. తొలి విడత అభ్యర్థుల ప్రకటనలోనే మాధవి లత పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. అప్పటి వరకు అంతగా పరిచయం లేని ఆమె.. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటన.. పైగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్పై పోటీకి దిగడంతో ఆమె మరింత పాపులారిటీ సంపాదించింది. ఇప్పటికే ఆమె తన పంచ్ డైలాగ్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా అఫిడవిట్లో ఆమె చూపించిన ఆస్తుల్లోనూ ఓ రేంజ్ చూపిస్తున్నారు. తెలంగాణలో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరిగా నిలిచి రికార్డ్ సృష్టించారు.
ఇది కూడా చదవండి: Nikhil: టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ.. మామ కోసం హీరో నిఖిల్ ప్రచారం
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బుధవారం మాధవి లత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అఫిడవిట్లో రూ.221 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఆమె పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో అత్యంత ధనిక లోక్సభ అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరిగా నిలిచారు. ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్, ముగ్గురు పిల్లలకు సంబంధించి రూ.165.46 కోట్లు ఉండగా.. దంపతులకు 55.91 స్థిరాస్తులు ఉన్నట్లుగా ఆమె ప్రకటించింది. మొత్తం రూ.221.37 కోట్లు ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
బుధవారం తన నామినేషన్ దాఖలు చేస్తూ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో మాధవి లత కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 49 ఏళ్ల వయసు కలిగిన మాధవి లత భాగ్యనగరంలో నివాసం ఉంటున్నారు. తొలిసారి ఆమె బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అనూహ్యంగా ఆమెకు సీటు దక్కింది. లిస్టెడ్ మరియు అన్లిస్టెడ్ కంపెనీల్లో రూ.25.20 కోట్ల పెట్టుబడితో సహా రూ. 31.31 కోట్ల చరాస్తులు తనకు ఉన్నాయని ఆమె ప్రకటించారు. అలాగే విరించి లిమిటెడ్లో రూ. 7.80 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. ఆభరణాలను కూడా కలిగి ఉన్నట్లు వెల్లడించారు. వాటి విలువ రూ. 3.78 కోట్లుగా పేర్కొన్నారు. ఆమె భర్త విరించి లిమిటెడ్లో రూ. 52.36 కోట్ల విలువైన షేర్లతో రూ. 88.31 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారని… అలాగే ముగ్గురు పిల్లలు కూడా రూ. 45 కోట్లకు పైగా చరాస్తులను కలిగి ఉన్నారని వెల్లడించారు.
ఇది కూడా చదవండి:Retirement: 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
ఇక ఆమె రూ. 6.32 కోట్ల స్థిరాస్తులను కలిగి ఉండగా.. ఆమె భర్త స్థిరాస్తుల విలువ రూ. 49.59 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల వ్యవసాయేతర భూమి, వాణిజ్య మరియు నివాస భవనాలు ఉన్నట్లు తెలిపారు. రూ.90 లక్షల అప్పు కూడా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఒక క్రిమినల్ కేసు ఉందని తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 295-A కింద ఆమెపై గత వారం బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ దగ్గర ఉన్న మసీదు వద్ద ఊహాజనిత బాణం గీసి కాల్చినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై క్రిమినల్ కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి: Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్?
తాజావార్తలు
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!