Komatireddy Rajgopal Reddy : నాతో వ్యక్తిగతంగా మోడీ మాట్లాడారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రామగుండంలో గల ఎరువుల ఫ్యాక్టరీని, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ తమిళి సై, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బేగంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. మునుగోడులో బీజేపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేశారని మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో చీకటి తరిమి సూర్యోదయం వస్తుందన్న మోడీ.. భయంతో నన్ను తిట్టేవాళ్లు ఇక్కడ ఉన్నారని వారి గురించి కార్యకర్తలు చింతించవద్దన్నారు మోడీ.
Also Read : Ponnala Lakhsmaiah : మోడీ శంకుస్థాపనకు వచ్చింది లేదు… ప్రారంభించిన పనే లేదు..
ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలంటూ కార్యకర్తలకు సూచించారు మోడీ. 25 ఏళ్లుగా తనకు చాలా రకాల తిట్లు తనకు అలవాటే అని కార్యకర్తలు పెద్దగా పట్టించుకోవద్దని టీఆర్ఎస్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోడీ. కమల వికాసం స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తుందని అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం రావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
అవినీతి, కుటుంబ పాలన దేశానికి మొదటి శత్రువులని మోడీ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సభ అనంతరం.. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మోడీ మట్లాడారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికను బాగా ఫైట్ చేశారని మోడీ నాతో అన్నారన్నారు. మీ గురించి అమిత్ షా నాకు అంతా చెప్పారని మోడీ అన్నారని ఆయన వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని, నాతో వ్యక్తిగతంగా మోడీ మాట్లాడారని ఆయన వెల్లడించారు. మునుగోడు సంబంధించి నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉందని మోడీ నాతో అన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!