కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడంటూ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లేస్తే తప్ప జగన్ ఏపీకి రావట్లేదంటూ కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడని ఆయన మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యురిటి, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని, రాబందులా ఐదేళ్లు రాష్ట్రాన్ని పీక్కు తిన్న జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందన్నారు కొల్లు రవీంద్ర.
Nandamuri : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే..
అంతేకాకుండా..’రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నా వెతుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉంది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వంశీ, కొడాలినాని పారిపోయారు. కొడాలి నాని, వంశీలను పేర్ని నానినే దాచాడనే అనుమానాలు ఉన్నాయి. జగన్ పిచ్చికి తగ్గట్టు మా బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడు. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూప్ లు పెట్టమనడాన్ని పేర్ని నానీ వక్రీకరిస్తున్నారు. పేర్ని నాని హైదరాబాద్ లో అక్రమ ఆస్తులు కొనటానికి వెళ్తే ప్రజలు తరిమారు. ఇలానే పేర్నినాని పిచ్చి ప్రేలాపనలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.’ అని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.
Fridge : ఈ ఆహారాలను ఫ్రిజ్లో ఉంచవద్దు.!