Kolikapudi Srinivasa Rao: తిరువూరు నియోజకవర్గ అభివృద్దే నా ప్రధాన లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలో 20వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. అందరూ కూడా టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కొలికపూడి కోరారు. 20 వార్డులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొలికపూడి శ్రీనివాసరావుకి తమ సమస్యను వార్డు సభ్యులు చెప్పడంతో అధికారంలోకి వచ్చిన వంద రోజులలో మీ సమస్యను తీరుస్తాను అని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్దే నా ప్రధాన లక్ష్యం, మీ అందరూ టీడీపీకి ఓటెయ్యండి, తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నేను చూపిస్తాను అని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
Read Also: Supreme Court : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదం.. సుప్రీంకోర్టులో విచారణకు డిమాండ్
Also Read
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
ఈ ప్రచార కార్యక్రమంలో మీడియాతో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరువూరు పట్టణంలోని 20వ వార్డులో యాదవ బజార్లో ప్రచారం చేస్తున్న నాకు యాదవ సామజ వర్గానికి చెందిన కొంతమంది యాదవ సోదరులు, మహిళలు వారి సమస్యను చెప్పుకున్నారన్నారు. యాదవుల సంప్రదాయం ప్రకారం కుల వృత్తిలో భాగంగా పశువుల పెంపకం చేస్తారు.. యాదవులు ఎన్ని ఇబ్బందులు వచ్చిన పశు పోషణ ఆపలేదు, చాలా రైతు కుటుంబాలు పశువులను వదిలేసిన, పశుపోషణ ఆపేసిన యాదవ సోదరులు ఇంకా పశుపోషణ కొనసాగిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. పట్టణాల్లో చాలా చోట్ల వెటర్నరి హాస్పిటల్స్ యాదవులు నివసించే ప్రాంతానికి దూరంగా ఉన్నాయి.. దీని వల్ల పశువుల పోషణ చేస్తున్న యాదవ సామాజిక వర్గం పశువులకు ఏదైనా సమస్య వస్తే వాటిని హాస్పిటల్ కి తీసుకెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఒకొక్కసారి పశువులు కూడా మృతి చెందుతున్నాయని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
Read Also: Ruhani Sharma: చూపులతో మాయ చేస్తున్న రుహాణి శర్మ…
యాదవులు వెటర్నరి హాస్పిటల్స్ వారు నివసించే ప్రాంతానికి దగ్గర ఉండాలని కోరుకుంటున్నారని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి, అలాగే రేపు రాబోయే టీడీపీ- జనసేన- బీజేపీ ప్రభుత్వ నాయకులకు తెలియజేస్తానన్నారు. ఎక్కడైతే పట్టణాల్లో యాదవులు ఎక్కువగా నివాసిస్తున్నారో.. పశుపోషణ ఎక్కువ జరుగుతుందో అక్కడ వెటర్నరి హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు. దీని వల్ల యాదవ సామాజిక వర్గాంతో పాటు పశుపోషణ చేసే మిగతా వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది అని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..