CSK vs RCB: పతిరానా ఓవర్లో కోహ్లీ హెల్మెట్కు తాకిన బంతి.. విరాట్ రియాక్షన్ చూడండి
- పతిరానా బౌలింగ్లో కోహ్లీ ల్మెట్కు తాకిన బంతి
- భయాందోళనకు గురైన అభిమానులు
- మరో బౌన్సర్కు సిక్స్ కొట్టిన కోహ్లీ
- అనంతరం కోహ్లీ పతిరానాతో ఏదో మాట్లాడాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెపాక్ స్టేడియంలో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్ను నెమ్మదిగా ప్రారంభించి.. చివరకు 30 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలో కోహ్లీ కాస్త ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా మూడో ఓవర్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేసేటప్పుడు కోహ్లీతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో.. కొద్ది సేపటి తరువాత కోహ్లీ తన స్వభావానికి తగ్గట్టుగా భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. 13వ ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో కోహ్లీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కోహ్లీ ఔటవడంతో ఆర్సీబీ అభిమానులు నిరాశకు గురయ్యారు.
మ్యాచ్లో ఓ కీలక ఘట్టం మతిష పతిరానా వేసిన బౌన్సర్ కారణంగా చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ ఈ బౌన్సర్ను భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్కు తాకిన తర్వాత హెల్మెట్కు తాకింది. ఇది చూసి స్టేడియంలో ఉన్న అభిమానులు కాస్త భయాందోళనకు గురయ్యారు. అయితే.. కోహ్లీ కొంత సమయం తర్వాత మళ్లీ ఆట కొనసాగించాడు. ఈ క్రమంలో.. పతిరానా మరో బౌన్సర్ వేయగా, కోహ్లీ ఆ బంతిని ఫైన్ లెగ్ వైపు సిక్స్గా మళ్లించాడు. సిక్స్ కొట్టిన తర్వాత.. కోహ్లీ పతిరానాతో ఏదో మాట్లాడినట్లు కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Also Read
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
Read also: Hulchul With Gun : బంజారా హిల్స్ రోడ్డుపై తుపాకీతో హల్చల్.. ఆకతాయిలు అరెస్ట్
చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఔటయ్యాడు . తొలి కొన్ని బంతుల్లో కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. మూడో ఓవర్లో ఖలీల్ మరియు అతని మధ్య చిన్న గొడవ కూడా కనిపించింది. అయితే, కోహ్లీ కొన్ని పెద్ద షాట్లు కొట్టడం ద్వారా తన ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో, అతను పతిరానా వేసిన బౌన్సర్పై షాట్ మిస్ అయ్యాడు మరియు బంతి అతని హెల్మెట్కు తగిలింది, దీనిని చూసి అందరూ షాక్ అయ్యారు.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్లేయింగ్ XIలో ఒక మార్పు చేసింది. నాథన్ ఎల్లిస్ స్థానంలో మతిష పతిరానాను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఆర్సీబీ కూడా తమ జట్టులో మార్పు చేసింది. రసిక్ సలాం దార్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ను తీసుకుంది. చెన్నై, బెంగళూరు జట్లు రెండూ తమ తొలి మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్లో కోహ్లీ ఇన్నింగ్స్ ఆశించినంత ప్రభావం చూపించకపోయినా.. పతిరానాతో జరిగిన ఆసక్తికర ఘటన అభిమానులకు ప్రత్యేకంగా ఆకట్టుకొంది.
https://twitter.com/lostparkerr/status/1905637943689236633
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!