Kodali Nani: ఆదాయపన్నుశాఖ నోటీసుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మంత్రులు, వైసీపీ నేతలు.. చంద్రబాబుపై మాటల దాడికి దిగుతున్నారు. అసలు ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదు? అంటూ నిలదీశారు.. ఇక, చంద్రబాబు అంటేనే ఓ రేంజ్లో విరిచుకుపడే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు.. 420, దొంగ.. చట్టాలను అడ్డం పెట్టుకొని, వ్యవస్థను అడ్డం పెట్టుకొని డబ్బుని ఎలా దోచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలిసిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి సింగపూర్ లో హోటల్స్ ఎలా వచ్చాయి..? ఎన్నికలకు రూ.5 వేల కోట్లు ఎలా ఖర్చు పెడతానని అంటాడు..? అంటూ ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు అవినీతిపరుడు కాదంటూ ఎక్కడా క్లీన్ చీట్ లేదన్నారు.
Read Also: Viral Video : వార్నీ.. వీడు మనిషేనా.. వరదల్లో పిచ్చి పనేంటి?
చంద్రబాబు 2 ఏకరాలతో ఇప్పటివరకి బ్రతికాడా? అంటూ నిలదీశారు కొడాలి నాని.. 2014లో ఓడిపోయినా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లాడు.. కానీ, కొత్త పొత్తులు పెట్టుకోలేదన్న ఆయన.. బీజేపీని వాటేసుకుంటాడు, కాంగ్రెస్ పార్టీతో కలుస్తానంటాడు. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గానీ, వైఎస్ రాజారెడ్డికి గానీ కొత్తగా డబ్బులు వచ్చాయా? ఏమైనా తిరుపతి బస్టాప్ లో కర్జూర కాయలు ఏమైనా అమ్మడా..? అని పంచ్లు వేశారు. అయితే, ఆదాయపన్నుశాఖను మేనేజ్ చేయడానికి బీజేపీ సంక నాకొచ్చు, మోడీ కాళ్లు పట్టుకోవచ్చు, అమిత్ షా ది ఇంకేదో నాకోచ్చు అంటూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ, ఎన్ని చేసినా ఈ రాష్ట్ర ప్రజల నుండి తప్పించుకోలేడు అంటూ చంద్రబాబును హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.