KNRUHS: మరోమారు బయటపడ్డ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్లక్ష్యం.. పాత ప్రశ్నపత్రాలతో విద్యార్థుల ఆవేదన
- మరోమారు బయటపడ్డ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్లక్ష్యం.
- పాత ప్రశ్నపత్రాలతో విద్యార్థుల ఆవేదన
- ఇదివరకు కూడా పరీక్షల నిర్వహణలో అనేక అవకతవకలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KNRUHS: వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అధికారుల నిర్లక్ష్యం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న నిర్వహించిన పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షలో 2023 నవంబర్లో వాడిన పాత ప్రశ్నపత్రాన్నే మళ్లీ ఉపయోగించారు. ఆ ప్రశ్నపత్రంపై కవర్లో ఉన్న కోడ్ నంబర్ కూడా మార్పు చేయకపోవడం గమనార్హం. దీనితో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత అవకతవకలు ఇంకా కొనసాగుతున్నాయా? కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గతంలో కూడా పరీక్షల నిర్వహణలో అనేక అవకతవకలకు గురైంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలలో బయో కెమిస్ట్రీ పేపర్ 1, పేపర్ 2లో సిలబస్లో లేని ప్రశ్నలను అందించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే నిర్లక్ష్యం పీజీ రేడియాలజీ పరీక్షల్లో కూడా కొనసాగుతోంది.
Also Read: Chiranjeevi: యూఏఈలో ఇంటర్నేషనల్ లీగ్ టీ20.. మ్యాచ్ను తిలకించిన మెగాస్టార్ చిరంజీవి
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
సాధారణంగా యూనివర్సిటీ అధికారులు పరీక్ష పత్రాల తయారీ, తనిఖీ ప్రక్రియను నిపుణులతో పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. మాములుగా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పరీక్ష నియంత్రణ అధికారి, సంబంధిత మోడరేటర్ ప్రశ్నపత్రాలను సరిచూడాలి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు అన్ని వైద్య కళాశాలలకు ఆన్లైన్ ద్వారా పేపర్ పంపాలి. కానీ, ఈ పకడ్బందీ ప్రక్రియను పాటించడంలో విశ్వవిద్యాలయం విఫలమవుతోంది. పాత ప్రశ్నపత్రం పునర్వినియోగం చేయడం విద్యార్థులపై అన్యాయం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
Also Read: Manchu Manoj: విష్ణుకి మనోజ్ ఛాలెంజ్.. నేను ఒక్కడినే ఏ ప్లేస్ కైనా వస్తా!
యూనివర్సిటీ పదవుల్లో పదేళ్లుగా ఉన్న అధికారులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. తక్షణమే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కేఎన్ఆర్హెచ్యూఎస్ ప్రతిష్టను కాపాడుకోవాలంటే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత అవసరం. ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని, విద్యార్థుల నమ్మకాన్ని పునరుద్ధరించడం అవసరం.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!