IPL 2025 Auction: వేలం నిర్వహించిన ఆర్సీబీ.. కేఎల్ రాహుల్కు రూ.20 కోట్లు!
- నవంబర్ 24-25వ తేదీల్లో మెగా వేలం
- అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాహుల్
- వేలం నిర్వహించిన ఆర్సీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగనుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. మెగా వేలంకు ముందు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ను లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీ విడిచి పెట్టిన విషయం తెలిసిందే. అట్టిపెట్టుకోవాలని ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా చూసినా.. అందుకు రాహుల్ ఒప్పుకోలేదట. ఏదేమైనా మెగా వేలంలో రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాక్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో చాలా మంది ఫాన్స్ పాల్గొన్నారు. అభిమానులు లోకేష్ రాహుల్ తన సొంత గూటికి చేరాలని కోరుకున్నారు. రాహుల్ను సొంతం చేసుకోవడానికి రూ.20 కోట్లు వెచ్చిందేందుకు అభిమానులు సిద్దమయ్యారు. మరికొంతమంది ఫ్యాన్స్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోసం పోటీ పడ్డారు. పంత్ కోసం భారీగా వెచ్చించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
Also Read: Cricketer Son: షాకింగ్.. అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు!
గతంలో లోకేష్ రాహుల్ ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఐపీఎల్ 2025 వేలంలో రాహుల్ను తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని సొంతం చేసుకునేందుకు భారీ మొత్తం వెచ్చించనున్నట్లు సమాచారం. రాహుల్ను తీసుకుని జట్టు పగ్గాలు అప్పగించాలనే ప్రణాళికతో ఆర్సీబీ ఉందట. ఆర్సీబీ పర్స్లో ప్రస్తుతం రూ.83 కోట్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, రజత్ పాటిదార్ను మాత్రం రిటైన్ చేసుకున్నా విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?