KK Mahender Reddy : రాజకీయ లబ్ది కోసం ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల మున్సిపల్ లో 7 విలీన గ్రామాలపై సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న మున్సిపల్లో విలీన గ్రామాలపై మతి భ్రమించి తీర్మానం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే రెండు పతకాలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 7 విలీన గ్రామాల ప్రజలు అభిప్రయాలు తీసుకోకుండా మంద బలం తో మున్సిలిపల్ లో కలిపారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. విలీన గ్రామాల కలిపి వారు ఉపాధి కోల్పోయిన వారికి ఎం సమాధానం ఇస్తారని, విలీన గ్రామాల నుండి ఇద్దరు చనిపోయిన కూడా వారి కి కనీసం వారిని పరామర్శించలేదన్నారు. చనిపోయిన ఇద్దరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని, గత ఎన్నికల్లో నేను హామీ ఇచ్చినా తర్వాత మున్సిపల్ లో తీర్మానం చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు. నేను ఓడిపోయినా మా ప్రభుత్వం పంచాయితిలుగా మారుస్తమని హామీ ఇచ్చిన. ఆటో కార్మికులను కూడా ఆదుకుంటాం సంవత్సరానికి 12 వేయిలు ఇస్తాం. కొందరు అనాలోచిత నిర్ణయాలతో మా ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే మాపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు పొలిమేర దాకా తరిమి కొడతారు. గత ప్రభుత్వం ఎందుకు విలీన గ్రామాలను ఎందుకు పంచాయితీ లు గా మార్చలేదు. కొందరి స్వలాభం కోసం విలీనం చేశారు.
సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ మాటలు నమ్మే స్థితిలో సిరిసిల్ల ప్రజలు లేరు. పాలిస్టర్, కాటన్ పరిశ్రమను, కార్మికులను ఆదుకుంటూ సిరిసిల్లకు పునర్వవైభవం తీసుకొస్తాం. కేటీఆర్ అధికారం లో ఉన్నప్పుడు కరెంటు సబ్సిడీ కొరకు ఎందుకు మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్ర అభవృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని కేటీఆర్ ను కోరుతున్న. చిల్లర మాటలు, చేస్టలు చేస్తే ఊరుకునేది లేదు. కేటీఆర్ ప్రజల సమస్యల కొరకు పోరాటం చేయు. మాది ప్రజా పాలన, గడిల పాలన కాదు. ప్రజ పాలన కొరకు మేము ప్రజల్లోకి వెళుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరకీ సమాన న్యాయం చేశాం. కేటీఆర్ అక్రమాల ద్వారా గెలిచి చిల్లర మాటలు, విమర్శలు చేయడం తగదని దయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉంది.’ అని కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
Also Read
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
తాజావార్తలు
-
YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
-
Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
-
AR Rahman: అల్మారలో దాచుకున్న అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు!
-
AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
-
Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!