Kishan Reddy: బీఆర్ఎస్ కార్యకర్తలు మోడీ నాయకత్వాన్ని బలపరచాలి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్రం, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిందన్నారు. మహారాష్ట్రలో, ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలకు తాళం వేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ రేపు అదే పరిస్థితి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్లాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలనేదానిపై ఎన్నికల మీటింగ్ లో చర్చ జరిగిందన్నారు. కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి వివరాలు సేకరించామన్నారు. ప్రాబబుల్స్ లిస్ట్ రెడీ అయ్యాదని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. బీజేపీ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ సీట్లు కూడా ఉంటాయి. తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం.. మెజార్టీ సీట్లు గెలుస్తామన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు. ప్రజలనుంచి సానుకూల స్పందన కనబడుతోందన్నారు. మా ప్రతిపక్షాలు నైరాశ్యంగా ఉన్నాయన్నారు. వారికి తమ భవిష్యత్తు అంధకారంలో కనబడుతుందన్నారు. గ్రామస్థాయిలో చేరికల పై దృష్టి పెట్టామన్నారు.
Read also: PV Narasimha Rao : బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి.. ఇన్నాళ్లకు దక్కిన అరుదైన గౌరవం
Also Read
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
ఎంపి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పీఎం మోడీ పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే విషయాన్ని వివరించారన్నారు. రిజర్వేషన్లను నెహ్రూ అడ్డుకున్న విషయాన్ని బట్టబయలు చేశారని తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బిసి రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకించారని..కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయిందని మండిపడ్డారు. మోడీ కులం పై ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కులంపై రాహుల్ తప్పుడు వాఖ్యలు, అసంబద్ధ వాఖ్యలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ ముఖ్యమంత్రి అయ్యాక ఓబీసీ లో ఆయన కులం చేరింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీతో పాటూ ఓబీసీ సమాజానికి రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ కులగణనను ఎక్కడా అడ్డుకోలేదు.. అడ్డు పడలేదన్నారు.
IND vs ENG: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!
తాజావార్తలు
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!