PV Narasimha Rao : బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి.. ఇన్నాళ్లకు దక్కిన అరుదైన గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Narasimha Rao : మాజీ ప్రధాని పివి నరసింహారావును ప్రకటించిన ప్రధాని, మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని భారతరత్నతో సత్కరిస్తున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ పండితుడు, రాజకీయవేత్తగా, నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా వెల్లడించారు.
Read Also:Nail Polish : నెయిల్ పాలిష్ లను ఎక్కువగా మారుస్తున్నారా? ఇది ఒక్కసారి చదవండి..
Also Read
- Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్కు ప్లస్ పాయింట్.. విరాట్ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
- 1983 Cricket World Cup: "తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం".. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
- Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
పీవీ నరసింహారావు పాత వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరలో 1921 జూన్ 28 న జన్మించారు. ఆయన అసలు పేరు పాములపర్తి వేంకట నరసింహారావు.. నాగపూర్ విశ్వవిద్యాలయంలో 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివారు. ఇక తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.
1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగారు. తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాలకు గుడ్బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఐదేళ్ల పరిపాలన పూర్తి చేసిన ప్రధానమంత్రులలో నెహ్రూ, గాంధీల కుటుంబం వెలుపల మొదటి వ్యక్తి పీవీ నరసింహారావు మాత్రమే. పి.వి.నరసింహారావు బహుభాషావేత్త. ఇంగ్లీషు, హిందీతో పాటు 17 భాషలు మాట్లాడగలడు. పీవీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ లాంటి ప్రతిభ కానీ.. వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!
-
NBK 112 : ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు : నారా లోకేష్
-
Dharman : అశ్వత్ మారిముత్తు నాలుగో దర్శకుడు… షాకింగ్ విషయం రివీల్ చేసిన రజినీ
-
Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్కు ప్లస్ పాయింట్.. విరాట్ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
-
Meta AI-Powered Smart Glasses: 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్.. ఏఐ పవర్డ్ మెటా గ్లాసెస్ విడుదల
ట్రెండింగ్
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..