Kishan Reddy : మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం 100కోట్లు మంజూరు చేశారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకున్న అనంతరం ధారూర్ మండలం కోట్ పల్లి
ప్రాజెక్టులో బోటింగ్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో హైదరాబాద్కు అత్యంత దగ్గరగా ఉన్న అనంతగిరి అడవుల్లో
పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి భారతదేశంలో ఉన్న సౌకర్యాలు మరే దేశంలోనూ లేవని ఆయన
వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పర్యాటక రంగాన్ని ప్రైవేట్ సెక్టార్ కింద కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పాలసీ
రూపొందించామని ఆయన వెల్లడించారు.
Also Read
- Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
- TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Virat Kohli: "నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు".. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. తక్కువ పెట్టుబడితో టూరిజంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆదివాసి ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 25 వేల కోట్ల రూపాయలను ఈ కార్యక్రమానికి కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. 45 రోజుల క్రితమే ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందని.. ఆదివాసులకు ఇల్లు నిర్మాణం కోసం నేరుగా నిధులు మంజూరు చేశామన్నారు. ఆధార్, రేషన్ కార్డు, విద్యుత్, అంగన్వాడి భవనం, ఆరోగ్య భద్రత వంటి కార్యక్రమాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
Demonte Colony 3 : థియేటర్లలో భయపెట్టేందుకు వస్తున్న ‘డెమోంటే కాలనీ 3’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
I Nobody Trailer : పృద్వి రాజ్ సుకుమారన్.. ‘ఐ-నోబడి’ ట్రైలర్.. అదిరింది
-
Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
-
TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
ట్రెండింగ్
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!