Kishan Reddy : గిరిజన సంక్షేమానికి మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమానికి మోడీ ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యిందన్నారు కిషన్ రెడ్డి. గత సంవత్సరం లక్ష పదిహేడు కోట్లకు పైగా గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ప్రధాని ఆదివాసీల అభివృద్ధి సంక్షేమ కార్య్రమo చేపడుతున్నామన్నారు కిషన్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎండ్లు గడుస్తున్న ఆదివాసీల బ్రతుకులు మారలేదన్నారు కిషన్ రెడ్డి. 75 తెగల ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, రేపటి నుంచి ప్రధాని ఆదివాసీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. గిరిజనుల అభివృద్ధికి పదకొండు అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, 18 రాష్ట్రాలలో 75 తెగల ఆదివాసీలు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, 82 వేల గూడెలు, 32 లక్షల ఆదివాసీలు దేశంలో ఉన్నారన్నారు కిషన్ రెడ్డి.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
ఆదివాసిల అభివృద్ధిపై మోడీ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని, 75 సంవత్సరాలుగా చేయలేని పని 45 రోజులలో మోడీ చేసి చూపించారన్నారు. అర్హులైన ఆదివాసీలకు సొంత ఇండ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని, వంద ఆదివాసిల హాస్టల్స్ నిర్మించబోతున్నామన్నారు కిషన్ రెడ్డి. ఆదివాసీల హాస్పిటల్స్ కట్టబోతున్నామని, ఆదివాసీల 17 గ్రామాల్లో రేపు కరెంట్ వెలగబోతోందన్నారు కిషన్ రెడ్డి. 72 వేల ఆధార్ కార్డులు, 83 వేల ఆయూస్మాన్ భవ హెల్త్ కార్డులు అందిస్తున్నామని, రేపు ఆదివాసీలకు 49 వెలకు పైగా క్యాస్ట్ సరిఫికెట్స్, 32 వెళ్ళు పైగా రేషన్ కార్డులు అందించబోతున్నామన్నారు. ఆదివాసీలు సంపూర్ణమైన సాధికారిత సాధించే దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఆదివాసీలు కనీసం మౌలిక వసతులు లేవన్నారు.
3 లక్షల ఆదివాసీల విద్యార్థులకు ఏక లవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్స్ ఏర్పాటు ఉంటుందని, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణకు కేటాయించందని ఆయన వెల్లడించారు. యూనివర్సిటీ ఏర్పాటు అయితే గిరిజన విద్యార్థుల బతుకులు మారుతాయని, యూనివర్సిటీ నిర్మానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలిక యునివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, తెలంగాణలో ఆదివాసీలు ఎక్కువగా వెనక బడిన ప్రాంతాలు, బూపాలపల్లి, హసిఫాబాధ్, భద్రాచలం ప్రాoతాలుగా గుర్తించామని ఆయన తెలిపారు. ట్రైబల్ టూరిజం అభివృద్ధి చేయడంపై కేంద్రం ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రేపు వర్చువల్ గా 18 రాష్ట్రాల గిరిజనులతో ప్రధాని మాట్లాడుతారన్నారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..