వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలో ఉండాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దోపిడి దొంగల పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేసి శిక్షలు వేస్తుందంటే అది భ్రమేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ అగ్గి లాంటి పార్టీ అని, ఏ పార్టీతోను కలవదన్నారు కిషన్ రెడ్డి.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని బీజేపీపై ఆరోపణలు చేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ ఎలా ఒక్కటో బీఆర్ఎస్ చెప్పాలన్నారు. అసదుద్దీన్ ఓవైసీ మొనగాడు ఏమీ కాదన్నారు కిషన్ రెడ్డి. ప్రతి రోజు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మూర్ఖుడు అని ఆయన మండిపడ్డారు. ముస్లింలందరూ ఆ పార్టీతో ఏమీ లేరన్నారు. మూడో సారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి అన్నారు. ఆ మూర్ఖుడి సంగతి చెప్పడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.