Kishan Reddy : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుంది
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిశామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుందని, తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ గెలువద్దని కుమ్మక్కు అవుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్కు ఓటేసిన బీఆర్ఎస్కు ఓటేసిన ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు బీజేపీకి ప్రధాన పార్టీ అని, బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ అరకొర సీటు గెలిచిన, ఒడినా తెలంగాణకు ఒరిగేది పోయేది ఏం లేదని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబం కోసం పని చేసే పార్టీ.. కుటుంబ అవశ్యకత పూర్తి అయిపోయిందన్నారు. హైదరాబాద్ ఎంఐఎం సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తామన్నారు.
హైదరాబాద్ ఎంపీ సీటులో అసదుద్దీన్ ను ఓడిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. సర్వేలు వాస్తవాలు కావని, తెలంగాణలో మెజార్టీ సీట్లు బీజేపీ గెలిచెలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని, వంద రోజుల్లో హామీలు ఆమలు, అవినీతి పరులు పై చర్యలు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇంకా మిన మేశాలు లెక్క పెడుతున్నారని, ఇంకా సెటిల్ మెంట్లు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరంపై చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఆడుకోవద్దని ఆయన అన్నారు. జల వివాదాల పై ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మభ్య పెడుతున్నారని, నాగార్జున సాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలని, బీజేపీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటుందన్నారు.
మళ్లీ మోడీ పీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే కేంద్ర కాంగ్రెస్ కోసం వసూళ్లు మొదలు పెట్టిందని, కేంద్ర కాంగ్రెస్ కు సూటు కేసులు మోస్తున్నారన్నారు. కర్ణాటకలో దోపిడీ చేసి తెలంగాణలో ఖర్చు పెడితే.. తెలంగాణ లో కాంగ్రెస్ దోపిడీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ కూటమీ బీటలు వారుతోందని, అత్యధిక స్థానాలు తెలంగాణ నుంచి గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న నేతలు బీజీపీ లో చేరాలి. అందుకు నేను పిలుపు ఇస్తున్నానని ఆయన అన్నారు. అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేస్తోందని, 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోందన్నారు. డబ్బుల కోసం మంత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెదిరిస్తున్నారని, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో లో బిజెపి స్వతంత్రంగా పోటీ చేస్తోందన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: కంఠీలు ధరించి, తిలకాలు పెట్టుకుని.. ప్రేమానంద మహారాజ్ వద్ద విరాట్-అనుష్క
-
Jeevan Reddy : పార్టీకి ఎప్పుడూ కీడు చేయలేదు.. బయటకు అందుకే వచ్చా..!
-
Love Trap: 180 మంది బాలికలపై అత్యాచారం కేసులో.. బాధితురాలి షాకింగ్ నిర్ణయం..
-
TVK Vijay: టీవీకే అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్.. నోటీసులు జారీ..
-
Groww Q4 Results: స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన గ్రో.. లాభాల పంట పండించిన ఈ షేరు గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!