Kishan Reddy : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిశామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుందని, తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ గెలువద్దని కుమ్మక్కు అవుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్కు ఓటేసిన బీఆర్ఎస్కు ఓటేసిన ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు బీజేపీకి ప్రధాన పార్టీ అని, బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ అరకొర సీటు గెలిచిన, ఒడినా తెలంగాణకు ఒరిగేది పోయేది ఏం లేదని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబం కోసం పని చేసే పార్టీ.. కుటుంబ అవశ్యకత పూర్తి అయిపోయిందన్నారు. హైదరాబాద్ ఎంఐఎం సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తామన్నారు.
హైదరాబాద్ ఎంపీ సీటులో అసదుద్దీన్ ను ఓడిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. సర్వేలు వాస్తవాలు కావని, తెలంగాణలో మెజార్టీ సీట్లు బీజేపీ గెలిచెలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని, వంద రోజుల్లో హామీలు ఆమలు, అవినీతి పరులు పై చర్యలు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇంకా మిన మేశాలు లెక్క పెడుతున్నారని, ఇంకా సెటిల్ మెంట్లు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరంపై చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఆడుకోవద్దని ఆయన అన్నారు. జల వివాదాల పై ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మభ్య పెడుతున్నారని, నాగార్జున సాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలని, బీజేపీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటుందన్నారు.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
మళ్లీ మోడీ పీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే కేంద్ర కాంగ్రెస్ కోసం వసూళ్లు మొదలు పెట్టిందని, కేంద్ర కాంగ్రెస్ కు సూటు కేసులు మోస్తున్నారన్నారు. కర్ణాటకలో దోపిడీ చేసి తెలంగాణలో ఖర్చు పెడితే.. తెలంగాణ లో కాంగ్రెస్ దోపిడీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ కూటమీ బీటలు వారుతోందని, అత్యధిక స్థానాలు తెలంగాణ నుంచి గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న నేతలు బీజీపీ లో చేరాలి. అందుకు నేను పిలుపు ఇస్తున్నానని ఆయన అన్నారు. అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేస్తోందని, 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోందన్నారు. డబ్బుల కోసం మంత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెదిరిస్తున్నారని, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో లో బిజెపి స్వతంత్రంగా పోటీ చేస్తోందన్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!