Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Election Campaign At Secunderabad

Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీకే మెజార్టీ సీట్లు

Published Date :March 27, 2024 , 7:03 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీకే మెజార్టీ సీట్లు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తెలంగాణలో ఈసారి బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ఇప్పటికే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారి పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. ఇప్పటికే ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటించినట్లు పేర్కొన్న కిషన్​ రెడ్డి.. డోర్​ టు డోర్​ వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, రాష్ట్రంలో డబుల్​ డిజిట్​ ఎంపీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని అంబర్​ పేట్ అసెంబ్లీ సెగ్మెంట్​ లోని గోల్నాక డివిజన్ శ్రీనివాస్ టవర్స్ కదిరి భాగ్, శంకర్ నగర్ బస్తిలో పర్యటించారు. అనంతరం సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రామ్ గోపాల్ పేట్, కాబ్రా కాంప్లెక్స్, పాన్ బజార్, రాణిగంజ్, ప్యాట్నీ, కలాసిగూడ, ఓల్డ్ బోయిగూడా, నాలా బజార్, మొండా మార్కెట్ బస్తిల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

దేశవ్యాప్తంగా లోక్​ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైందని కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణలో నిర్వహించిన ఐదు బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా పోలింగ్​ బూత్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ప్రకటించాం. పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాం. ప్రధానంగా భారీ బహిరంగ సభల కంటే.. డోర్​ టు డోర్​ వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయి నాయకుడు గానీ, జిల్లా స్థాయి నాయకుడు గానీ ప్రతి ఒక్కరూ డోర్​ టు డోర్​ వెళ్లే కార్యక్రమంలో విధిగా భాగస్వామ్యులయ్యేలా ప్రణాళిక రూపొందించాం. దేశవ్యాప్తంగా కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా.. డబుల్​ డిజిట్​ పార్లమెంట్​ సభ్యులు గెలిచే అవకాశం ఉన్నది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు బీజేపీకి సానుకూలంగా స్పందిస్తున్నారు”అని కిషన్​ రెడ్డి తెలిపారు.

Also Read

  • Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!
  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
Add as a preferred
source on google

గతంలో బీఆర్​ఎస్​ కు, కాంగ్రెస్​ కు ఓటు వేసిన ప్రజలు.. ఈసారి మాత్రం బీజేపేకే ఓటేస్తామని చెబుతున్నారని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. “ఈసారి దేశం కోసం ఓటేస్తాం.., అభివృద్ధికే ఓటేస్తాం, మా పిల్లల భవిష్యత్​ కే ఓటేస్తాం.. అని తెలంగాణల ప్రజలు అంటున్నారు. ప్రజలు మరోసారి మోడీని ప్రధాన మంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆయనను ఆశీర్వదిస్తున్నారు. అందుకే తప్పకుండా బీజేపీ తెలంగాణలో అత్యధిక సీట్లు సాధిస్తుంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్​ఎస్​ ఆవశ్యకత లేదు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండు పార్టీలు ఒక్కటే. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా వృథానే అవుతుంది”అని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Kishan Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions