Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీకే మెజార్టీ సీట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈసారి బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారి పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. ఇప్పటికే ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటించినట్లు పేర్కొన్న కిషన్ రెడ్డి.. డోర్ టు డోర్ వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అంబర్ పేట్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని గోల్నాక డివిజన్ శ్రీనివాస్ టవర్స్ కదిరి భాగ్, శంకర్ నగర్ బస్తిలో పర్యటించారు. అనంతరం సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రామ్ గోపాల్ పేట్, కాబ్రా కాంప్లెక్స్, పాన్ బజార్, రాణిగంజ్, ప్యాట్నీ, కలాసిగూడ, ఓల్డ్ బోయిగూడా, నాలా బజార్, మొండా మార్కెట్ బస్తిల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైందని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణలో నిర్వహించిన ఐదు బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ప్రకటించాం. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాం. ప్రధానంగా భారీ బహిరంగ సభల కంటే.. డోర్ టు డోర్ వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయి నాయకుడు గానీ, జిల్లా స్థాయి నాయకుడు గానీ ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ వెళ్లే కార్యక్రమంలో విధిగా భాగస్వామ్యులయ్యేలా ప్రణాళిక రూపొందించాం. దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా.. డబుల్ డిజిట్ పార్లమెంట్ సభ్యులు గెలిచే అవకాశం ఉన్నది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు బీజేపీకి సానుకూలంగా స్పందిస్తున్నారు”అని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read
- Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
గతంలో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలు.. ఈసారి మాత్రం బీజేపేకే ఓటేస్తామని చెబుతున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. “ఈసారి దేశం కోసం ఓటేస్తాం.., అభివృద్ధికే ఓటేస్తాం, మా పిల్లల భవిష్యత్ కే ఓటేస్తాం.. అని తెలంగాణల ప్రజలు అంటున్నారు. ప్రజలు మరోసారి మోడీని ప్రధాన మంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆయనను ఆశీర్వదిస్తున్నారు. అందుకే తప్పకుండా బీజేపీ తెలంగాణలో అత్యధిక సీట్లు సాధిస్తుంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా వృథానే అవుతుంది”అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!