Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Election Campaign At Secunderabad

Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీకే మెజార్టీ సీట్లు

Published Date :March 27, 2024 , 7:03 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీకే మెజార్టీ సీట్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ఈసారి బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ఇప్పటికే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారి పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. ఇప్పటికే ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటించినట్లు పేర్కొన్న కిషన్​ రెడ్డి.. డోర్​ టు డోర్​ వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, రాష్ట్రంలో డబుల్​ డిజిట్​ ఎంపీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని అంబర్​ పేట్ అసెంబ్లీ సెగ్మెంట్​ లోని గోల్నాక డివిజన్ శ్రీనివాస్ టవర్స్ కదిరి భాగ్, శంకర్ నగర్ బస్తిలో పర్యటించారు. అనంతరం సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రామ్ గోపాల్ పేట్, కాబ్రా కాంప్లెక్స్, పాన్ బజార్, రాణిగంజ్, ప్యాట్నీ, కలాసిగూడ, ఓల్డ్ బోయిగూడా, నాలా బజార్, మొండా మార్కెట్ బస్తిల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

దేశవ్యాప్తంగా లోక్​ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైందని కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణలో నిర్వహించిన ఐదు బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా పోలింగ్​ బూత్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ప్రకటించాం. పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాం. ప్రధానంగా భారీ బహిరంగ సభల కంటే.. డోర్​ టు డోర్​ వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయి నాయకుడు గానీ, జిల్లా స్థాయి నాయకుడు గానీ ప్రతి ఒక్కరూ డోర్​ టు డోర్​ వెళ్లే కార్యక్రమంలో విధిగా భాగస్వామ్యులయ్యేలా ప్రణాళిక రూపొందించాం. దేశవ్యాప్తంగా కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా.. డబుల్​ డిజిట్​ పార్లమెంట్​ సభ్యులు గెలిచే అవకాశం ఉన్నది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు బీజేపీకి సానుకూలంగా స్పందిస్తున్నారు”అని కిషన్​ రెడ్డి తెలిపారు.

గతంలో బీఆర్​ఎస్​ కు, కాంగ్రెస్​ కు ఓటు వేసిన ప్రజలు.. ఈసారి మాత్రం బీజేపేకే ఓటేస్తామని చెబుతున్నారని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. “ఈసారి దేశం కోసం ఓటేస్తాం.., అభివృద్ధికే ఓటేస్తాం, మా పిల్లల భవిష్యత్​ కే ఓటేస్తాం.. అని తెలంగాణల ప్రజలు అంటున్నారు. ప్రజలు మరోసారి మోడీని ప్రధాన మంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆయనను ఆశీర్వదిస్తున్నారు. అందుకే తప్పకుండా బీజేపీ తెలంగాణలో అత్యధిక సీట్లు సాధిస్తుంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్​ఎస్​ ఆవశ్యకత లేదు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండు పార్టీలు ఒక్కటే. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా వృథానే అవుతుంది”అని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Kishan Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions