TS BJP: రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ను పరిశీలించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షున్ని మారుస్తారనే వార్తల నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోనుంది. ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి ఓకే వేదిక మీద కలువనున్నారు. ఈనెల 8వ తేదీన ప్రధాని మోడీ హన్మకొండకు రానున్న నేపథ్యంలో బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం బీజేపీ రాష్ట్ర శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల రాష్ట్రంలో బీజేపీ పార్టీ గ్రాఫ్ తగ్గిపోయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మోడీ పాల్గొనే సభకు ప్రాధాన్యం సంతరించుకున్నది.
Read Also: Allu Arjun: అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది… ఈసారి పాన్ ఇండియా లెవల్లో
Also Read
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
- శ్రావణంలో నాన్వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
కాజీపేట అయోద్యపురం వద్ద రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ కు ఈనెల 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేయనున్నారు. వర్క్ షాప్ శంఖుస్థాపన ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ పరిశీలించారు. దక్షిణమద్య రైల్వే అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ను అప్ గ్రేడ్ చేస్తూ వ్యాగన్ తయారు యూనిట్ గా కేంద్రం మార్చనున్నారు.
Read Also: Husband Attack Wife: దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే..?
వర్క్ షాప్ కోసం గత ఫిబ్రవరి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 160 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత 40 ఏళ్ళుగా నినాదంగా మారిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. రాష్ట్ర విభజన చట్టంలోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ.. నెరవేరని హామీఫై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శల నేపథ్యంలో కేంద్ర సర్కార్ మెట్టుదిగింది. కోచ్ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్ మ్యానుప్యాక్షరింగ్ వర్క్ షాప్ గా సెంట్రల్ సర్కార్ మార్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా బీజేపీ ప్రకటన చేయించనుంది.
Read Also: Mouse: ట్రాఫిక్ను స్తంభింపజేసిన ఎలుకలు.. గంటలపాటు ఇబ్బంది పడ్డ నగరవాసులు
మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆయనపైన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి వరంగల్ లో నేడు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభ సక్సెస్ చేయడంపైనా, సభకు చేయాల్సిన ఏర్పాట్లపైనా, జన సమీకరణపైనా వీరు చర్చించనున్నారు. ఈపరిణామం కాషాయ శ్రేణుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ఎడమొహం, పెడమొహంగా ఉన్న బండి, ఈటల ఒకే వేదిక మీదకు హాజరుకావడంపై పార్టీలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్కు సెకండ్ హోమ్గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!