Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం.. 2024 జూన్ కల్లా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Meeting On Polavaram Project Work Process With Gajendra Singh Shekhawat: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో.. ప్రధానంగా 6 అంశాలపై చర్చ సాగింది. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుపై చర్చించారు. గత వారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కూడా కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ప్రభుత్వం తాత్కాలిక ఆర్ధిక సహాయం అర్థించింది. తొలి విడత పనుల్లో 41.15 మీటర్ల ఎత్తు వరకు ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, సహాయ పునరావాస పనుల నిమిత్తం.. ఆర్థిక సహాయంగా 17 వేల 414 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. తొలి దశలోనే 100 శాతం డ్యామ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి చెప్పారు.
Minister Venu Gopala Krishna: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు
Also Read
- ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
2025 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇంతకుముందు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే.. ఓ ఏడాది ముందుగానే, అంటే 2024 జూన్ కల్లా పూర్తయ్యేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్రమంత్రి షెకావత్ కోరారు. ఏపి ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించి, నిధుల విడుదల కోసం ఆర్ధిక మంత్రిత్వ శాఖకు పంపే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం షెకావత్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పురోగతి, సమస్యలు సమీక్షించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తవ్వాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. కాగా.. ఈ సమావేశంలో జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, సలహాదారు వెదిరె శ్రీరామ్, ఏపీ ప్రభుత్వం ఇంజనీర్ ఇన్ ఛీఫ్ నారాయణ రెడ్డి, కేంద్ర జల సంఘం అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
Madhavilatha : పెళ్లిపై హాట్ కామెంట్స్ చేసిన మాధవిలత.. నెటిజన్స్ ట్రోల్స్..
తాజావార్తలు
-
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
-
KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
-
Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్షిప్ అవకాశం!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!