Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం.. 2024 జూన్ కల్లా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Meeting On Polavaram Project Work Process With Gajendra Singh Shekhawat: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో.. ప్రధానంగా 6 అంశాలపై చర్చ సాగింది. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుపై చర్చించారు. గత వారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కూడా కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ప్రభుత్వం తాత్కాలిక ఆర్ధిక సహాయం అర్థించింది. తొలి విడత పనుల్లో 41.15 మీటర్ల ఎత్తు వరకు ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, సహాయ పునరావాస పనుల నిమిత్తం.. ఆర్థిక సహాయంగా 17 వేల 414 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. తొలి దశలోనే 100 శాతం డ్యామ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి చెప్పారు.
Minister Venu Gopala Krishna: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు
Also Read
- Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
2025 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇంతకుముందు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే.. ఓ ఏడాది ముందుగానే, అంటే 2024 జూన్ కల్లా పూర్తయ్యేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్రమంత్రి షెకావత్ కోరారు. ఏపి ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించి, నిధుల విడుదల కోసం ఆర్ధిక మంత్రిత్వ శాఖకు పంపే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం షెకావత్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పురోగతి, సమస్యలు సమీక్షించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తవ్వాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. కాగా.. ఈ సమావేశంలో జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, సలహాదారు వెదిరె శ్రీరామ్, ఏపీ ప్రభుత్వం ఇంజనీర్ ఇన్ ఛీఫ్ నారాయణ రెడ్డి, కేంద్ర జల సంఘం అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
Madhavilatha : పెళ్లిపై హాట్ కామెంట్స్ చేసిన మాధవిలత.. నెటిజన్స్ ట్రోల్స్..
తాజావార్తలు
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..