Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్షిప్ అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Army Internship 2026: డిజిటల్ యుగంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల వద్దే జరగడం లేదు. సమాచారం, సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం కూడా నేటి వ్యూహాత్మక రంగాలుగా మారాయి. ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు భారత సైన్యం జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిజిటల్ కంటెంట్ తయారీ నుంచి మీడియా విశ్లేషణ, సోషల్ మీడియా ప్రచార వ్యూహాల రూపకల్పన వరకు కీలక అంశాలపై శిక్షణ అందించే ఈ కార్యక్రమం యువతకు ప్రొఫెషనల్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. అయితే ఈ ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత సైన్యంలో ఉద్యోగం వస్తుందనే ప్రచారానికి మాత్రం భారత సైన్యం స్పష్టమైన వివరణ ఇచ్చింది.
ఈ ఇంటర్న్షిప్ మొత్తం 75 రోజుల పాటు కొనసాగుతుంది. దీనిని రెండు దశలుగా నిర్వహించనున్నారు. తొలి 15 రోజులు ఆన్లైన్ విధానంలో శిక్షణ ఉంటుంది. ఈ దశలో ఎంపికైన విద్యార్థులు వర్చువల్గా శిక్షణ పొందుతారు. అనంతరం 60 రోజుల పాటు ఢిల్లీలో ఆఫ్లైన్ శిక్షణ నిర్వహిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుంది. వ్యూహాత్మక కమ్యూనికేషన్ రంగంలో ఉన్నత స్థాయి ప్రొఫెషనల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని భారత సైన్యం తెలిపింది.
Also Read
- RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ఇంటర్న్షిప్లో పాల్గొనే విద్యార్థులకు స్టైపెండ్ కూడా అందజేస్తారు. ప్రతి నెల రూ.30 వేల చొప్పున చెల్లించి, మొత్తం 75 రోజుల ఇంటర్న్షిప్ పూర్తయ్యే నాటికి రూ.75 వేల వరకు స్టైపెండ్ లభిస్తుంది. అయితే ఇందుకు ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి. హాజరు ప్రమాణాన్ని పూర్తి చేసిన అభ్యర్థులకే పూర్తి స్టైపెండ్ అందజేస్తారు. క్రమశిక్షణ, సమయపాలనకు ఈ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సైన్యం పేర్కొంది.
డ్రెస్ కోడ్ విషయంలో కూడా కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి. జీన్స్, టీ షర్టులు లేదా ఇతర క్యాజువల్ దుస్తులు ధరించి రావడానికి అనుమతి ఉండదు. పురుషులు ఫార్మల్ ప్యాంట్, షర్ట్, ట్రౌజర్, ఫార్మల్ షూస్ ధరించాల్సి ఉంటుంది. మహిళా విద్యార్థులు సూట్ లేదా వెస్ట్రన్ ఫార్మల్ దుస్తులతో హాజరు కావాలి. శిక్షణా వాతావరణానికి అనుగుణంగా ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ను తప్పనిసరి చేశారు.
ఈ అవకాశానికి దేశవ్యాప్తంగా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. భారత సైన్యం అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు AICTE ఇంటర్న్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2026 ఆగస్టు 2గా నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో విద్యార్థి చదువుతున్న కోర్సుకు సంబంధించి విభాగాధిపతి లేదా రిజిస్ట్రార్ జారీ చేసిన డిగ్రీ వెరిఫికేషన్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటో సమర్పించాల్సి ఉంటుంది.
ఇంటర్న్షిప్ సమయంలో భద్రతా నిబంధనలు కూడా కఠినంగా అమలు చేస్తారు. శిక్షణా కేంద్రంలోకి ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. ప్రవేశ ద్వారం వద్దే వాటిని జమ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రాజెక్ట్ అవసరమైతే మాత్రమే వాటి వినియోగానికి అనుమతి ఇస్తారు. శిక్షణ కోసం అవసరమైన కంప్యూటర్ వర్క్స్టేషన్లు, ఇంటర్నెట్ సదుపాయం కేంద్రంలోనే అందుబాటులో ఉంటాయి. అయితే సాధారణ కీప్యాడ్ ఫోన్ను వెంట ఉంచుకోవడానికి అనుమతి ఉంటుంది.
ఈ కార్యక్రమంపై వస్తున్న ఉద్యోగ అవకాశాల ప్రచారానికి కూడా భారత సైన్యం స్పష్టత ఇచ్చింది. ఈ ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి సైన్యంలో ప్లేస్మెంట్ లేదా ఉద్యోగ హామీ ఉండదని వెల్లడించింది. ఇది పూర్తిగా వ్యూహాత్మక కమ్యూనికేషన్ రంగంలో ప్రొఫెషనల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు రూపొందించిన శిక్షణా కార్యక్రమమే తప్ప నియామక ప్రక్రియలో భాగం కాదని స్పష్టం చేసింది. యువ జర్నలిస్టులకు డిజిటల్ మీడియా, కంటెంట్ వ్యూహాలు, సమాచార నిర్వహణపై ప్రత్యక్ష అనుభవాన్ని అందించడమే ఈ ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రధాన లక్ష్యంగా భారత సైన్యం పేర్కొంది.
- Tags
- Indian Army
- internship
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!