Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం.. 2024 జూన్ కల్లా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Meeting On Polavaram Project Work Process With Gajendra Singh Shekhawat: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో.. ప్రధానంగా 6 అంశాలపై చర్చ సాగింది. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుపై చర్చించారు. గత వారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కూడా కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ప్రభుత్వం తాత్కాలిక ఆర్ధిక సహాయం అర్థించింది. తొలి విడత పనుల్లో 41.15 మీటర్ల ఎత్తు వరకు ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, సహాయ పునరావాస పనుల నిమిత్తం.. ఆర్థిక సహాయంగా 17 వేల 414 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. తొలి దశలోనే 100 శాతం డ్యామ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి చెప్పారు.
Minister Venu Gopala Krishna: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు
Also Read
- Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
2025 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇంతకుముందు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే.. ఓ ఏడాది ముందుగానే, అంటే 2024 జూన్ కల్లా పూర్తయ్యేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్రమంత్రి షెకావత్ కోరారు. ఏపి ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించి, నిధుల విడుదల కోసం ఆర్ధిక మంత్రిత్వ శాఖకు పంపే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం షెకావత్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పురోగతి, సమస్యలు సమీక్షించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తవ్వాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. కాగా.. ఈ సమావేశంలో జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, సలహాదారు వెదిరె శ్రీరామ్, ఏపీ ప్రభుత్వం ఇంజనీర్ ఇన్ ఛీఫ్ నారాయణ రెడ్డి, కేంద్ర జల సంఘం అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
Madhavilatha : పెళ్లిపై హాట్ కామెంట్స్ చేసిన మాధవిలత.. నెటిజన్స్ ట్రోల్స్..
తాజావార్తలు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?