Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం.. 2024 జూన్ కల్లా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Meeting On Polavaram Project Work Process With Gajendra Singh Shekhawat: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో.. ప్రధానంగా 6 అంశాలపై చర్చ సాగింది. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుపై చర్చించారు. గత వారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కూడా కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ప్రభుత్వం తాత్కాలిక ఆర్ధిక సహాయం అర్థించింది. తొలి విడత పనుల్లో 41.15 మీటర్ల ఎత్తు వరకు ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, సహాయ పునరావాస పనుల నిమిత్తం.. ఆర్థిక సహాయంగా 17 వేల 414 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. తొలి దశలోనే 100 శాతం డ్యామ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి చెప్పారు.
Minister Venu Gopala Krishna: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. సీఎం జగన్ భరోసా ఇస్తున్నారు
Also Read
- Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
- Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ 'గట్ ఫీల్' గురించే అంటూ వ్యాఖ్యలు..
2025 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇంతకుముందు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే.. ఓ ఏడాది ముందుగానే, అంటే 2024 జూన్ కల్లా పూర్తయ్యేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్రమంత్రి షెకావత్ కోరారు. ఏపి ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించి, నిధుల విడుదల కోసం ఆర్ధిక మంత్రిత్వ శాఖకు పంపే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం షెకావత్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పురోగతి, సమస్యలు సమీక్షించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తవ్వాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. కాగా.. ఈ సమావేశంలో జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, సలహాదారు వెదిరె శ్రీరామ్, ఏపీ ప్రభుత్వం ఇంజనీర్ ఇన్ ఛీఫ్ నారాయణ రెడ్డి, కేంద్ర జల సంఘం అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
Madhavilatha : పెళ్లిపై హాట్ కామెంట్స్ చేసిన మాధవిలత.. నెటిజన్స్ ట్రోల్స్..
తాజావార్తలు
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?