Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు.. అవేవో చూడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొత్త విషయం చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న నింధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబందించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1, 2024 నుంచే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనల మార్పు అంశంపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకపై ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావచ్చు. కొత్త నిబంధనల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడే తెలుసుకోండి. నూతన నిబంధనల ప్రకారం మీరు ఇకపై ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులుగా మీరు ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి మీకు ఓ సర్టిఫికేట్ ఇస్తారు.
READ MORE: Good Bad Ugly: ఈసారి సంక్రాంతికి అజిత్ ను దించుతున్న మైత్రీ మూవీ మేకర్స్
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
దాని తీసుకుని ఆర్టీఓ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. దానితో పాటు పలు పత్రాలు సమర్పించాలి. ఈ కొత్త రూల్స్ జూన్ నుంచి అమలులోకి వస్తాయి. ఈ నిబంధనల ముఖ్యఉద్దేశం నేరుగా ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం. పూర్తిగా ఆన్లైన్ ద్వారా లైసెన్స్ జారీ చేయడం. దీని ద్వారా సమయం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు పలు నిబంధనలు పెట్టింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం అయితే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఫోర్ వీలర్ శిక్షణ కోసం అయితే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలని పేర్కొంది. అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది. అలాగే అందులో ఉండే ట్రైనర్లకు కనీసం హైస్కూల్ డిప్లామా అర్హత తప్పనిసరి చేసింది కేంద్రం. కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలని నొక్కి చెప్పింది. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపింది. లైట్ మోటార్ వెహికల్ శిక్షణ 4 వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలని వివరించింది. అలాగే ఈ శిక్షణ రెండు విభాగాలుగా ఉండాలి.. థియరీ కోసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం 21 గంటలు కనీసం కేటాయించాల్సి ఉంది. హెవీ మోటార్ వెహికల్స్ అయితే 38 గంటల కనీస శిక్షణ.. 8 గంటలు థియరీ ఎడ్యుకేషన్, 31 గంటలు ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. కొత్తగా లైసెన్స్ తీసుకునేందుకు యత్నించేవాళ్లు ఈ నిబంధనలు దృష్టిలో ఉంచుకోవాలి.
తాజావార్తలు
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..