Sabarimala: శబరిమలలో ప్రసాదం కొరత.. ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Travancore Devaswom Board: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రసాదానికి కొరత ఏర్పాడింది. శబరిమల ప్రసాదాన్ని ప్రత్యేక డబ్బాలలో ఇస్తారు.. అయితే, ఇప్పుడు ఆ డబ్బాలకు కొరత ఏర్పడింతో.. ప్రసాదంపై ట్రావెన్ కోర్ దేవస్థాన్ బోర్డు ఆంక్షలు విధించింది. శబరిమలకు వచ్చే ఒక్కో భక్తుడికీ కేవలం రెండు డబ్బాలు మాత్రమే ఇస్తామని వెల్లడించింది. అయితే, అయ్యప్ప భక్తులకు 2 డబ్బాలు ఏమాత్రం సరిపోవు అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బాల కొరత, ప్రసాద పంపిణీకి అనేక చిక్కులు తెచ్చిపెడుతోంది.
Read Also: Telangana : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
అయితే, ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. ఆలయం దగ్గర విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. కిలోమీటర్ల మేరా క్యూ లైన్ ఉంటోంది. ఇక, సంక్రాంతి సమయంలో మకర జ్యోతిని చూసేందుకు స్వాములు పెద్ద ఎత్తున వెళ్లే అవకాశం ఉంది. ఇలా వెళ్లిన భక్తులు భారీ సంఖ్యలో ప్రసాదం కొనుగోలు చేస్తారు.. దాంతో ప్రసాదం డబ్బాల వాడకం బాగా పెరిగిపోయింది. కానీ కొత్త డబ్బాల తయారీ మాత్రం ఆలస్యం అవుతుంది. ఇక, ఉన్న డబ్బాలను జాగ్రత్తగా అందరికీ వచ్చేలా చెయ్యాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఒక్కో అయ్యప్ప స్వామికీ రెండు డబ్బాలే ఇస్తామని ప్రకటించింది. అయితే, ట్రావెన్ కోర్ దేవస్థానం ఈ విషయం చెప్పడంతో అయ్యప్ప భక్తులకు నిరాశ కలిగిస్తుంది. సాధారణంగా ప్రతీ స్వామీ కనీసం 10 డబ్బాలైనా కొనుగోలు చేస్తారు. దేవస్థానం బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకొని ఎక్కువ డబ్బాలు ఇవ్వాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్వాములు వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!