CM Pinarayi Vijayan: ఫిబ్రవరి 8న జంతర్ మంతర్ వద్ద నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) నిరసన చేపట్టనుంది. ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నట్లు పేర్కొంది. కేరళ, ఇతర బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా నిర్లక్ష్యం చేసిందని ఆందోళన చేయడం ఈ నిరసన లక్ష్యమన్నారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. ఇది.. కేవలం కేరళ సమస్యలకు సంబంధించినది కాదని, ఇతర బీజేపీయేతర రాష్ట్రాలు పంచుకుంటున్న విస్తృత ఆందోళనకు ప్రతినిధి అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Sashastra Seema Bal: ఎస్ఎస్బీ చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి నియామకం..
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
ఈ సందర్భంగా గోవిందన్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్వయంప్రతిపత్తిపై ఆరోపణ, కేంద్రం విధించిన ఆర్థిక పరిమితులపై ఆందోళనలను ఎత్తిచూపుతూ నిరసనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి విజయన్ బిజెపియేతర ముఖ్యమంత్రులందరికీ లేఖ రాశారన్నారు. కాగా.. బీజేపీ రెచ్చగొట్టే రీతిలో హిందూత్వ ఎజెండాను కొనసాగిస్తోందని, ఈ విశ్వాసాన్ని రాజకీయం చేసే మతోన్మాద ధోరణిని దేశంలో చూస్తోందన్నారు. ప్రజలందరికీ తమ మతాన్ని విశ్వసించే, ప్రచారం చేసే హక్కు ఉండటమే నిజమైన లౌకిక విధానమన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నారని, ఇంకా రామమందిరం పూర్తికాలేదన్నారు.
Read Also: Bodige Galanna Passed Away: మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కుటుంబంలో తీవ్ర విషాదం
లోక్సభ ఎన్నికలకు ముందు ఈ రామమందిరాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని గోవిందన్ పేర్కొన్నారు. తాము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తెలిపారు. అంతేకాకుండా.. అసంపూర్తిగా ఉన్న రామమందిరంలో ప్రాణప్రతిష్ట చేయడం తమ విశ్వాసాలకు, ఆచారాలకు విరుద్ధమని శంకరాచార్యులు అభిప్రాయపడ్డారని ఆయన అన్నారు. ఇది విశ్వాసానికి విరుద్ధమైనా.. ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారని గోవిందన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!