Arvind Kejriwal: ఎన్నికల ముందు శుభవార్త.. మరో 80,000 మందికి వృద్ధాప్య పెన్షన్
- ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్
- ప్రకటించిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
- 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు- కేజ్రీవాల్
- తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారు- కేజ్రీవాల్.
ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇందుకోసం 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారని కేజ్రీవాల్ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అతిషి, మంత్రి సౌరభ్ భరద్వాజ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో 80 వేల వృద్ధాప్య పింఛన్లు ప్రారంభమవుతున్నాయి. 2015లో మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 3.32 లక్షల మంది వృద్ధులు పింఛను పొందుతున్నారు. దాదాపు 4.50 లక్షలకు పెంచాం. ఇప్పుడు మరో 80 వేల పెంపు జరుగుతోంది.’ అని కేజ్రీవాల్ అన్నారు.
IMD Warning: దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక!
Also Read
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
- Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
వృద్ధులకు పెన్షన్పై కేబినెట్ ఆమోదించడమే కాకుండా ఢిల్లీ ప్రభుత్వం కూడా అమలు చేసిందని కేజ్రీవాల్ అన్నారు. నిన్నటి నుంచి ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది.. 24 గంటల్లో 10 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఢిల్లీలో 60 నుంచి 69 ఏళ్ల మధ్య ఉన్న వృద్ధులకు నెలకు రూ.2,000 పెన్షన్ వస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.2500 పెన్షన్ వస్తుందని చెప్పారు. మరోవైపు.. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పాలిస్తున్న బీజేపీని దుయ్యబట్టారు. డబుల్ ఇంజన్లో రూ.500-600, సింగిల్ ఇంజన్లో నెలకు రూ.2500 పెన్షన్ వస్తుందని కేజ్రీవాల్ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతికూలత ఉంది.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంజిన్తో కొనసాగండి అంతా బాగానే ఉంటుందని తెలిపారు.
AP Rain Alert: దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం.. మరి కొద్ది గంటల్లో తీవ్రంగా మారే అవకాశం..
తాను జైలుకు వెళ్లగానే వృద్ధుల పింఛను నిలిపివేశారని కేజ్రీవాల్ అన్నారు. బయటకు రాగానే దాన్ని ప్రారంభించానన్నారు. ఈ పెద్దల ఆశీర్వాదంతోనే తాను బయటకు వచ్చానని ఆప్ అధినేత తెలిపారు. వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం వల్ల ఆశీస్సులు, శ్రేయస్సు లభిస్తాయని అన్నారు. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది తప్ప తగ్గదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!