Arvind Kejriwal: ఎన్నికల ముందు శుభవార్త.. మరో 80,000 మందికి వృద్ధాప్య పెన్షన్
- ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్
- ప్రకటించిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
- 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు- కేజ్రీవాల్
- తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారు- కేజ్రీవాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇందుకోసం 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారని కేజ్రీవాల్ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అతిషి, మంత్రి సౌరభ్ భరద్వాజ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో 80 వేల వృద్ధాప్య పింఛన్లు ప్రారంభమవుతున్నాయి. 2015లో మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 3.32 లక్షల మంది వృద్ధులు పింఛను పొందుతున్నారు. దాదాపు 4.50 లక్షలకు పెంచాం. ఇప్పుడు మరో 80 వేల పెంపు జరుగుతోంది.’ అని కేజ్రీవాల్ అన్నారు.
IMD Warning: దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక!
Also Read
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
వృద్ధులకు పెన్షన్పై కేబినెట్ ఆమోదించడమే కాకుండా ఢిల్లీ ప్రభుత్వం కూడా అమలు చేసిందని కేజ్రీవాల్ అన్నారు. నిన్నటి నుంచి ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది.. 24 గంటల్లో 10 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఢిల్లీలో 60 నుంచి 69 ఏళ్ల మధ్య ఉన్న వృద్ధులకు నెలకు రూ.2,000 పెన్షన్ వస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.2500 పెన్షన్ వస్తుందని చెప్పారు. మరోవైపు.. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పాలిస్తున్న బీజేపీని దుయ్యబట్టారు. డబుల్ ఇంజన్లో రూ.500-600, సింగిల్ ఇంజన్లో నెలకు రూ.2500 పెన్షన్ వస్తుందని కేజ్రీవాల్ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతికూలత ఉంది.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంజిన్తో కొనసాగండి అంతా బాగానే ఉంటుందని తెలిపారు.
AP Rain Alert: దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం.. మరి కొద్ది గంటల్లో తీవ్రంగా మారే అవకాశం..
తాను జైలుకు వెళ్లగానే వృద్ధుల పింఛను నిలిపివేశారని కేజ్రీవాల్ అన్నారు. బయటకు రాగానే దాన్ని ప్రారంభించానన్నారు. ఈ పెద్దల ఆశీర్వాదంతోనే తాను బయటకు వచ్చానని ఆప్ అధినేత తెలిపారు. వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం వల్ల ఆశీస్సులు, శ్రేయస్సు లభిస్తాయని అన్నారు. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది తప్ప తగ్గదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!