AP Rain Alert: దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం.. మరి కొద్ది గంటల్లో తీవ్రంగా మారే అవకాశం..
- దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం..
- మరి కొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం..
- ఇవాల్టి నుంచి వాయుగుండ ప్రభావం ప్రారంభం కానుందన్న అధికారులు..
- దక్షిణ కోస్తా, రాయలసీమకు ఐఎండి వర్ష సూచన జారీ..
- ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరి కొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఇవాల్టి నుంచి వాయుగుండ ప్రభావం ప్రారంభం కానుందని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని, వాయువ్య దిశగా పయనించి రెండు రోజులు తమిళనాడు-శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈనెల 27,28,29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ పనుల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
Read also: Health Tips: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
Also Read
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే పలు చోట్ల చలి గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి విజృంభిస్తోంది. గత ఐదు రోజులుగా చలి ఎనిమిది డిగ్రీలకు చేరి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాడేరులో వాహనదారులు ఉన్ని బట్టలు వేసుకున్నా చలికి తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. అప్పటి వరకు వాహనదారులు హెడ్లైట్ల వెలుగులో ప్రయాణిస్తున్నారు. కొన్ని చోట్ల పొగమంచు వర్షంలా కురుస్తుంది. అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Top Headlines @1PM : టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!