AP Rain Alert: దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం.. మరి కొద్ది గంటల్లో తీవ్రంగా మారే అవకాశం..
- దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం..
- మరి కొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం..
- ఇవాల్టి నుంచి వాయుగుండ ప్రభావం ప్రారంభం కానుందన్న అధికారులు..
- దక్షిణ కోస్తా, రాయలసీమకు ఐఎండి వర్ష సూచన జారీ..
- ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరి కొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఇవాల్టి నుంచి వాయుగుండ ప్రభావం ప్రారంభం కానుందని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని, వాయువ్య దిశగా పయనించి రెండు రోజులు తమిళనాడు-శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈనెల 27,28,29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ పనుల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
Read also: Health Tips: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
Also Read
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే పలు చోట్ల చలి గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి విజృంభిస్తోంది. గత ఐదు రోజులుగా చలి ఎనిమిది డిగ్రీలకు చేరి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాడేరులో వాహనదారులు ఉన్ని బట్టలు వేసుకున్నా చలికి తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. అప్పటి వరకు వాహనదారులు హెడ్లైట్ల వెలుగులో ప్రయాణిస్తున్నారు. కొన్ని చోట్ల పొగమంచు వర్షంలా కురుస్తుంది. అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Top Headlines @1PM : టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!