Arvind Kejriwal: “బీజేపీ నన్ను చంపేందుకు ప్రయత్నించింది”.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
- బీజేపీ నన్ను చంపేందుకు ప్రయత్నించింది
- బీజేపీ పంపిన గూండాల నాపై దాడికి యత్నించారు
- అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలోని జహంగీర్పురిలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నిన్న నేను ఢిల్లీలోని వికాస్పురికి వెళ్లానని, అక్కడ బీజేపీ.. గూండాలను పంపి నన్ను చంపేందుకు ప్రయత్నించింది. నాపై దాడి చేశారు. మీకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయండి. నన్ను జైలుకు పంపి నా పని అక్కడే ఖతం చేయాలని చూశారు. గత 75 ఏళ్లలో ఏ పార్టీ, ఏ నాయకుడు చేయని పనిని నేను గత పదేళ్లులో నేను చేశాను. నిజాయితీతో పని చేస్తున్నాను. 2014లో 7-8 గంటలపాటు కరెంటు కోతలు ఉండేవి. కానీ ఇప్పుడు కరెంటు కోత లేదు. 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు లేదు. ఉచిత రేవూరి పంపిణీ చేస్తున్నారని బీజేపీ వాళ్లు నన్ను దుర్భాషలాడుతున్నారు. బీజేపీ తప్పుడు కేసులో నన్ను జైలుకు పంపింది. మళ్లీ నన్ను సీఎం చేయండి.” అని పేర్కొన్నారు.
READ MORE: Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఇదిలా ఉండగా… ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై శుక్రవారం దాడికి ప్రయత్నించారు. కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వికాస్పురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘కొందరు బీజేపీ గూండాలు తమపై దాడికి ప్రయత్నించారు’ అని ఆప్ చెబుతోంది. ‘బీజేపీ గూండాలు కేజ్రీవాల్ దగ్గరికి వచ్చారని, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని’ ఆప్ ఆరోపించింది. ఈ ఘటనను పార్టీ సీరియస్గా తీసుకుని పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోషల్ మీడియా ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ, జైలుతో కేజ్రీవాల్ను అణిచివేయాలని ప్రయత్నించగా.. ఫలించలేదని.. దీంతో బీజేపీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ జీపై దాడికి యత్నించిందని ఆరోపించారు. కేజ్రీవాల్కి ఏదైనా జరిగితే దానికి నేరుగా బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
READ MORE: Love Couple Suicide: కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!