Kejriwal: ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా!?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పదవిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేయరంటూ మరొక వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఆప్ నేతలు కొట్టిపారేస్తున్నారు. జైల్లో ఉన్న.. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని.. అక్కడ నుంచే పరిపాలిస్తారని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఇది సాధ్యం కాని అంశం. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి మరొకరిని తన స్థానంలో కూర్చుండబెట్టొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం అస్థిరపడకుండా ఉండాలంటే.. మరో ముఖ్యమంత్రిని ఎంచుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ న్యాయ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ అధికారుల బలవంతపు చర్య నుంచి రక్షణ కల్పించాలని.. ఇందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్పై ధర్మాసనం స్పందించాలని కోరారు. కానీ శుక్రవారం రావాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
అతిషి వ్యాఖ్యలు..
అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రజలకు ప్రేమ, అభిమానం అని మంత్రి అతిషి తెలిపారు. ఏవో కారణాలు చూపి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయొచ్చు.. కానీ అతని ఆలోచనలను అరెస్ట్ చేయలేరని తెలిపారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే వీధిలో మరో కేజ్రీవాల్ పుట్టుకొస్తారని పేర్కొన్నారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ తీసుకున్నారని.. కేజ్రీవాల్ సెక్రటరీ మొబైల్ కూడా తీసుకున్నారని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్తో బీజేపీ పన్నాగం బయటపడింది అని సౌరభ్ భరద్వాజ్, అతిషి ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని.. జైలు నుంచి పాలన సాగిస్తారని అతిషి స్పష్టం చేశారు.
లిక్కర్ స్కామ్లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు ఆరోపించారు. కేజ్రీవాల్ సర్కార్ 2021లో లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. 2022లో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ముడుపులకు అనుకూలంగానే ఈ పాలసీని తీసుకొచ్చారని ఈడీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!