నేడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా వెలుగుతున్న కీర్తి సురేష్ ప్రయాణం చాలా సాదాసీదాగా మొదలైంది. స్టార్ కిడ్ అయినప్పటికీ, ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి, తన మొదటి పనికి అందుకున్న పారితోషికం కేవలం 500 రూపాయలు. చిన్నప్పుడే సినిమాల్లో నటించినప్పటికీ, కీర్తి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసిన తర్వాతే పూర్తిస్థాయి నటిగా వెండితెరపై అడుగుపెట్టింది కీర్తి.
Also Read : Rakshit Shetty : వేర్ ఈజ్ రక్షిత్ శెట్టి…? సినిమాలు ఎందుకు చేయడం లేదు
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం ‘మహానటి‘ . లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది కీర్తి. ఈ విజయంతో కీర్తి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నేడు పాన్ ఇండియా స్టార్ హీరోల సరసన నటిస్తూ, ఒక్కో సినిమాకు సుమారు 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది. కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితం కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తట్టిల్తో ఆమెకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన వీరి ప్రేమ ప్రయాణం గతేడాది వివాహ బంధంతో ఒక్కటైంది. కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కీర్తి సురేష్ టాప్ స్టార్ గా దూసుకెళ్తోంది. ప్రస్తుతం కీర్తి దాదాపు 10 పైగా సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.