KCR: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు ఆంధ్రా పేపర్లు ఉద్యమాన్ని కింద మీద చేశారని ఆరోపించారు. వాళ్ళు అడిగితే ఒకటే మాట చెప్పినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళుతున్నా.. తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తానని చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని తెలిపారు.
Barcode: నవజాత శిశువును విసిరేసిన తల్లి.. “బార్కోడ్” సాయంతో పట్టుకున్న పోలీసులు..
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ప్రపంచంలో రైతు బంధు అనే పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టామన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే రైతు బంధు మరో వెయ్యి పెంచుదాం అనుకున్నామని కేసీఆర్ తెలిపారు. దళిత బంధు పథకంతో తెలంగాణలోనే హుజూరాబాద్ లో దళితులు సంపన్నులు అయ్యారని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గానికి దోఖాలేదు ఇది టెంపరరీ సెట్ బ్యాక్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పీఎం నరేంద్ర మోడీ కూడా అసూయ పడే పెట్టుబడులు వచ్చాయన్నారు. నాలుగైదు నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కోసవెల్లె పరిస్థితి లేదని విమర్శించారు.
Brinda Karat: బీజేపీ ఊహలు గ్యాస్ బుడగల్లా ఉన్నాయి.. చివరకు పేలిపోక తప్పదు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ తెలిపారు. ఇంత తొందర వ్యవస్థ ట్రాక్ ఎందుకు తప్పింది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల ఫలితమేనని ఆరోపించారు. గోదావరి నీళ్లు కర్ణాటకకు ఇస్తా అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి సప్పుడు చేయడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో మన ప్రభుత్వం లేనందుకు కేంద్రంలో మన ఎంపీలను గెలిపించండని కేసీఆర్ కోరారు. గతంలో ఉన్న కరీంనగర్ ఎంపీ తమలపాకు నమలడం తిట్ల పురాణం తప్పితే చేసిందేమీ లేదని విమర్శించారు. బస్సు యాత్రకు వచ్చిన ఆదరణ చూసి 48 గంటలు తన ప్రచారం ఆపారన్నారు. ఎంపీ ఎన్నికల తరువాత హుజూరాబాద్ నియోజక వర్గానికి వచ్చి అందరితో కలిసి పండుగ చేసుకొందామని కేసీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!