KC Venugopal: భయంకర విషాదాన్ని తృటిలో తప్పించుకున్నాం.. అదృష్టమే కాపాడింది!
- మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య
- ఎయిర్ ఇండియా విమానం చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- సంఘటనపై కాంగ్రెస్ అగ్రనేత పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KC Venugopal post about India Flight Emergency Landing: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI2455)లో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్ చెన్నైలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల ప్రకారం.. విమానం రెండు గంటలకు పైగా గాలిలో ఉండి.. చివరకు చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం రాత్రి 8 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి.. రాత్రి 10.35 గంటలకు చెన్నైలో ల్యాండ్ అయిందని సమాచారం.
ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. ఎంపీలు కేసీ వేణుగోపాల్, కోడిక్కున్నిల్ సురేష్, అదూర్ ప్రకాష్, కే రాధాకృష్ణన్, రాబర్ట్ బ్రూస్లు తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందించారు. పైలట్ తక్షణ నిర్ణయం ప్రయాణికుల ప్రాణాలను కాపాడిందన్నారు. ‘భయంకర విషాదాన్ని మేము తృటిలో తప్పించుకున్నాం. నైపుణ్యం, అదృష్టం రెండూ మమ్నల్సి కాపాడాయి. క్లియరెన్స్ కోసం దాదాపు రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్వేపై మరొక విమానం ఉంది. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులకు ఎప్పటికీ అదృష్టం కలిసిరాదు. ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరుకుతున్నా’ అని కేసీ వేణుగోపాల్ ఎక్స్లో పేర్కొన్నారు.
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
Also Read: Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. 13 నుంచి అతి భారీ వానలు!
చెన్నై విమానాశ్రయంలోని రన్వేపై మరొక విమానం ఉందన్న ఎంపీ కేసీ వేణుగోపాల్ వాదనను ఎయిర్ ఇండియా తోసిపుచ్చింది. సాంకేతిక సమస్య, వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నై వైపు విమానాన్ని మళ్లించాలని మేము నిర్ణయించుకున్నాం అని పేర్కొంది. ఇది ముందు జాగ్రత్త చర్య అని స్పష్టం చేయాలనుకుంటున్నామని తెలిపింది. చెన్నై విమానాశ్రయంలో మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ “గో-అరౌండ్” ఆదేశించిందని, రన్వేపై మరే ఇతర విమానం ఉండటం వల్ల కాదని ఎయిర్ ఇండియా అంటోంది.
Air India flight AI 2455 from Trivandrum to Delhi – carrying myself, several MPs, and hundreds of passengers – came frighteningly close to tragedy today.
What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…
— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!