Karumuri Nageswara Rao : లోకేష్.. బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్పై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర మొదటి రోజే సినీ నటి జమున మరణం, పాదయాత్రలో గుండెనొప్పితో కుప్పకూలి చావు బతుకుల మధ్య తారకరత్న అంటూ ఆయన విమర్శించారు. సీఎం జగన్ ను జాదురెడ్డి అని విమర్శించే అర్హత లోకేష్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇంతవరకు వార్డు మెంబర్ కూడా గెలవలేని లోకేష్ ఏమని పాదయాత్ర చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబు వస్తది అని గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని నిరుద్యోగులకు ఒక్క జాబు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగాల పేరిట యువకులను నయవంచన చేసి యువగళం పేరిట పాదయాత్ర చేయడం విడ్డూరమన్నారు మంత్రి కారుమూరి. జాబ్ నాకు ఇచ్చావు కానీ యువకులకు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబును లోకేష్ ప్రశ్నించాలని ఆయన మంత్రి కారుమూరి ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చారని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Ram Charan: సక్సెస్ వచ్చిందని గర్వపడకు బ్రో.. పెద్దవారిని గౌరవించు
Also Read
దేశంలో చిన్న వయసులోనే పాదయాత్ర చేసి సీఎం అయిన జగన్.. కులాలకు అతీతంగా అందరికీ ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్ది ఆయన కొనియాడారు. లోకేష్ నువ్వు పప్పు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని ఆయన అన్నారు. బీసీలలో ఉన్న 136 కులాలను 56 కార్పొరేషన్లు ఏర్పరచిన సీఎం జగన్.. మీరందరూ కలిసినా సీఎం జగన్ కాలి వేలు మీది వెంట్రుక కూడా పీకలేరని ఆయన వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 కు175 సీట్లు ఖాయమన్నారు మంత్రి కారుమూరి.
Also Read : Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?