Karnataka: మంత్రా మజాకా… దీపావళికి గిఫ్ట్గా బంగారమా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో దివాళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ దివాళి సందర్భంగా పలువురు తమకు ఇష్టమైన వారికి బహుమతులు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కర్ణాటక మంత్రి చేసిన పని ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. సాధారణంగా మంత్రి స్థాయి హోదా అనుభవించే వ్యక్తులు క్షేత్రస్థాయి నేతలు తమ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తపడుతుంటారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నమే చేశారు కర్ణాటక పర్యాటక మంత్రి ఆనంద్ సింగ్.
Read Also: Air Polution: ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి వేళ రెచ్చిపోయిన రాజధానివాసులు
Also Read
- Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
- Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
దీపావళి సందర్భంగా మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజక వర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన వస్తువులను కానుకలుగా అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు, ఇతర గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు సెట్ల బాక్సులు పంపించారు. మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్లకు పంపించిన గిఫ్ట్ బాక్స్లో రూ.1 లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి, ఒక సిల్క్ చీర్, ఒక ధోతీ, డ్రై ప్రూట్స్ బాక్స్ ఒకటి పంపించారు. ఇక గ్రామ పంచాయతీ సభ్యులకు పంపించిన బాక్స్లో బంగారం మినహాయించి తక్కువ మొత్తం నగదుతో మిగతా వాటినన్నింటినీ పంపించారు. మొత్తం 35 మంది మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు.. 182 మంది గ్రామ పంచాయతీ సభ్యులకు ఈ గిఫ్ట్ బాక్సులను అందజేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఉచితంగా ఎందుకిచ్చారని నిలదీస్తున్నారు.
Read Also: Rishi Sunak: రిషి సునాక్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ హోస్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ నియోజక వర్గంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఎన్నికైన వారందరికి ఈ ఖరీదైన గిఫ్ట్లను మంత్రి పంపించినట్లు తెలిసింది. అయితే ఈ బహుమతులను తీసుకోవడానికి కొందరు నిరాకరించినట్టు తెలుస్తుంది. ఏదిఏమైనా నగదు, బంగారం పెట్టి పంపించడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.
తాజావార్తలు
-
Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
-
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!