Air Polution: ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి వేళ రెచ్చిపోయిన రాజధానివాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Polution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. దీన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా అవన్నీ కంటితుడుపుగానే కొనసాగుతున్నాయి. కారణం ప్రభుత్వాలు కాలుష్యం పెరుగుతోంది తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నా.. ప్రజలు మాత్రం కాలుష్యం విషయాన్ని పెడచెవిన పెడుతున్నారనడంతో సందేహం లేదు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో బాణాసంచా కాల్పడంపై ఆప్ ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ నగరవాసులు ఆంక్షలను ఉల్లంఘించారు. దక్షిణ. వాయువ్య ఢిల్లీతో సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సంధ్యా సమయానికి క్రాకర్లు పేల్చడం ప్రారంభించారు. దీంతో దీపావళి రాత్రి ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత పడిపోయింది.
Read Also: Diwali Celebrations: భాగ్యనగరంలో దీపావళి సందడి.. టపాసుల మోతతో మారుమోగుతున్న నగరం
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
ఢిల్లీ, నోయిడాల్లో గాలి నాణ్యత ‘చాలా పేలవమైన’ స్థాయికి చేరుకుంది. అంతకుముందు.. సోమవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఏక్యూఐ 301గా నమోదు కాగా.. దీపావళి అర్థరాత్రి వరకు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఎయిర్ స్టాండర్డ్స్ ఏజెన్సీలు తెలిపాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ప్రకారం.. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఎక్యూఐ) దీపావళికి ముందు రోజు (ఆదివారం) 259 గా నమోదైంది, ఇది ఏడేళ్ల కనిష్ట స్థాయి. ఆదివారం జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించినందుకు ఆనందంతో ప్రజలు బాణాసంచా కాల్చారు. ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ క్రాకర్లు కాలుస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో దీపావళి రోజు రాత్రి బాణాసంచా కాల్చారు. అందువల్ల, గాలి నాణ్యత చాలా తీవ్రమైన వర్గానికి చేరుకుందని తెలిపారు. దీపావళి రోజున దేశ రాజధానిలో పటాకులు పేల్చితే ఆరు నెలల వరకు జైలు శిక్ష రూ.200 జరిమానా విధిస్తామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గత వారం తెలిపారు.
Read Also: Banana Peel: అరటి తొక్కే కదా అని తీసేస్తే.. ఈ నష్టాలు తప్పవు
ఏదేమైనప్పటికీ,ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం పడిపోయింది. 24 గంటల సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 312 గా నమోదు అయ్యిందనీ, ఏడేళ్లలో రెండోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని, 2018లో దీపావళి రోజున నగరం AQI 281గా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మళ్లీ పటాకుల మోత పెరిగితే.. గాలి నాణ్యత మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!