Air Polution: ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి వేళ రెచ్చిపోయిన రాజధానివాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Polution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. దీన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా అవన్నీ కంటితుడుపుగానే కొనసాగుతున్నాయి. కారణం ప్రభుత్వాలు కాలుష్యం పెరుగుతోంది తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నా.. ప్రజలు మాత్రం కాలుష్యం విషయాన్ని పెడచెవిన పెడుతున్నారనడంతో సందేహం లేదు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో బాణాసంచా కాల్పడంపై ఆప్ ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ నగరవాసులు ఆంక్షలను ఉల్లంఘించారు. దక్షిణ. వాయువ్య ఢిల్లీతో సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సంధ్యా సమయానికి క్రాకర్లు పేల్చడం ప్రారంభించారు. దీంతో దీపావళి రాత్రి ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత పడిపోయింది.
Read Also: Diwali Celebrations: భాగ్యనగరంలో దీపావళి సందడి.. టపాసుల మోతతో మారుమోగుతున్న నగరం
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ఢిల్లీ, నోయిడాల్లో గాలి నాణ్యత ‘చాలా పేలవమైన’ స్థాయికి చేరుకుంది. అంతకుముందు.. సోమవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఏక్యూఐ 301గా నమోదు కాగా.. దీపావళి అర్థరాత్రి వరకు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఎయిర్ స్టాండర్డ్స్ ఏజెన్సీలు తెలిపాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ప్రకారం.. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఎక్యూఐ) దీపావళికి ముందు రోజు (ఆదివారం) 259 గా నమోదైంది, ఇది ఏడేళ్ల కనిష్ట స్థాయి. ఆదివారం జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించినందుకు ఆనందంతో ప్రజలు బాణాసంచా కాల్చారు. ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ క్రాకర్లు కాలుస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో దీపావళి రోజు రాత్రి బాణాసంచా కాల్చారు. అందువల్ల, గాలి నాణ్యత చాలా తీవ్రమైన వర్గానికి చేరుకుందని తెలిపారు. దీపావళి రోజున దేశ రాజధానిలో పటాకులు పేల్చితే ఆరు నెలల వరకు జైలు శిక్ష రూ.200 జరిమానా విధిస్తామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గత వారం తెలిపారు.
Read Also: Banana Peel: అరటి తొక్కే కదా అని తీసేస్తే.. ఈ నష్టాలు తప్పవు
ఏదేమైనప్పటికీ,ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం పడిపోయింది. 24 గంటల సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 312 గా నమోదు అయ్యిందనీ, ఏడేళ్లలో రెండోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని, 2018లో దీపావళి రోజున నగరం AQI 281గా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మళ్లీ పటాకుల మోత పెరిగితే.. గాలి నాణ్యత మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!