Karnataka Farmer : 205కేజీల ఉల్లి కేవలం 8రూపాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Farmer : దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత ఎప్పుడూ నిలువుదోపిడీకి గురవుతున్నాడు. ఆరుగాలం కష్టపడ్డా ఆఖరుకు ఏదో ఒక విధంగా మోసపోతూనే ఉన్నాడు. ఒకసారి ప్రకృతి మోసం చేస్తే మరోసారి ప్రభుత్వాలు మోసగిస్తున్నాయి. ఇవి రెండు కాకుండా దళారులు రైతులను దోచేస్తున్నారు. వాళ్లు వ్యవసాయం చేసి కోట్లు సంపాదించాలని ఆశపడరు. ఒక రూపాయి ఎక్కువొస్తుందని అనుకుంటే కొన్ని మైళ్ల దూరం పంటను తరలించుకుపోతుంటారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఎంత రేటు వచ్చినా పంట అమ్ముకోకతప్పక పరిస్థితి. కర్ణాటకకు చెందిన ఓ రైతుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు రవాణా ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లాడు. తీరా అక్కడకి వెళ్లాక అతనికి అందింది ఎంతో తెలుసా కేవలం రూ.8.36 పైసలు.
Read Also: IPS Tarun Joshi: వరంగల్ సీపీ ఆకస్మిక బదిలీ.. అసలు ఏం జరిగింది..?
Also Read
- Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. స్పష్టం చేసిన భారత్
- Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్పై అన్నామలై ఫైర్
- Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
- West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని గడాగ్ జిల్లాకు చెందిన పెవడెప్ప హళికేరి ఉల్లి గడ్డ సాగుచేశారు. వర్షాలు బాగా కురవడంతో దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గింది. పంట నికరంగా 205 కిలోలు తేలింది. స్థానికంగా మంచి ధర పలకదనే ఉద్దేశంతో మరికొంతమందితో కలిసి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వంత్ పూర్ మార్కెట్ కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా సరైన రేటు లేకపోయినా గత్యంతరం లేక, దారిఖర్చులకన్నా ఉపయోగపడతాయని క్వింటాల్ రూ.200 చొప్పున అమ్మేశాడు. అయితే, అది దారిఖర్చులకు కూడా సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట మొత్తం తీసుకున్న వ్యాపారి లెక్కలు కట్టి తన చేతిలో రూ.8.36 పైసలు పెట్టడంతో పెవడెప్ప అవాక్కయ్యాడు. ఇదేంటని అడిగితే.. మొత్తం 205 కిలోలకు రూ.410. అందులో ఫ్రైట్ చార్జీలు రూ.377.64, హమాలీ ఖర్చు రూ.24 లను తీసేస్తే మిగిలేది రూ.8.36 పైసలేనని లెక్కచెప్పాడట. పంట పండించేందుకు తనకు సుమారు రూ.25 వేల దాకా ఖర్చయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగా మరో రైతు ఇబ్బంది పడకూడదని, యశ్వంత్ పూర్ మార్కెట్ కు రావొద్దని చెప్పాడు. కాగా, పెవడెప్ప పంట అమ్మకానికి సంబంధించిన రశీదును ఓ వ్యక్తి ట్విట్టర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
This is how The double engine Govt of @narendramodi & @BSBommai doubling the income of farmers (Adani)
Gadag farmer travels 415 km to Bengaluru to sell onions, gets Rs 8.36 for 205 kg! pic.twitter.com/NmmdQhAJhv
— Arjun (@arjundsage1) November 28, 2022
తాజావార్తలు
-
Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. స్పష్టం చేసిన భారత్
-
Warrant on ZEE5: నేరస్తులకు చుక్కలు చూపించే కానిస్టేబుల్… ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్
-
Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్పై అన్నామలై ఫైర్
-
FASTag issue : ఫాస్టాగ్ పని చేయట్లేదా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
-
Sridhar Babu : హైదరాబాద్లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!