DK Shiva Kumar: ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shiva Kumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ టీమ్ పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను ఎవరు సంప్రదిస్తున్నారో, వారికి ఏమి అందిస్తున్నారో తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తెలియజేస్తున్నారని శివకుమార్ అన్నారు. ఈ విషయాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ద్వారా వెల్లడిస్తానని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘అవును.. మాకు తెలుసు.. ఎమ్మెల్యేలంతా తమను ఎవరు కలుస్తున్నారో నాకు, ముఖ్యమంత్రికి పూర్తి సమాచారం ఇస్తున్నారని.. వారికి ఏం ఆఫర్ చేస్తున్నారో చెబుతున్నారని వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ బృందం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. అన్ని విషయాలపై మా వద్ద సమాచారం ఉంది… ఇప్పుడు కాదు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సంప్రదించిన ఎమ్మెల్యేల నుంచి వెల్లడిస్తామని తెలిపారు.
Also Read: Congress Bus Yatra 2023: కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్ గాందీ, ప్రియాంక
Also Read
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
- Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
- Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
- Abhishek Banerjee: మమత మేనల్లుడికి బిగుస్తున్న ఉచ్చు.. మరో కేసు నమోదు..
సింగపూర్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని శివకుమార్ గతంలో కూడా పేర్కొన్నారు. కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తున్నట్లు ఇటీవల కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత ఆర్.అశోక్ మాట్లాడుతూ.. ఒకప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్కు మెజారిటీ ఉండేదని, దేశంలోని 15-20 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉండేవని, అయితే ఇలాంటి వాటి వల్ల కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని అశోక్ అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆర్ఎస్ఎస్ని నిషేధించండి, మీ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదని ఆయన అన్నారు. ఈ ఏడాది 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది.
తాజావార్తలు
-
Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
-
Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!