Karnataka: బడ్జెట్లో ముస్లింకు కొంచెం ఎక్కువ ఇచ్చాం.. వివాదాస్పదమైన మంత్రి వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కర్ణాటక హోం మినిస్టర్ బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతూ.. ఈ సారి ముస్లిం సమాజానికి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఎక్కువ ఇచ్చామని అన్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. మంత్రి వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఇది వివక్ష అంటూ విమర్శించారు.
‘‘ ఎస్సీ, ఎస్టీలకు 24 శాతం ఇచ్చామని, ఎందుకంటే వారు వెనుకడి ఉన్నారని, అలాగే ముస్లింలు కూడా వెనకబడి ఉన్నందున వారికి మేము కొంచెం ఎక్కవ నిధులు కేటాయించాం’’అని పరమేశ్వర ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత సీటీ రవి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ మతవాద కాంగ్రెస్ సెక్యులర్ మోడల్’’అని విమర్శించారు. నిధుల కేటాయింపులో కర్ణాటక హోం మంత్రి వ్యాఖ్యలపై సీటీ రవి విరుచుకుపడ్డారు.
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
Read Also: Gaanja Shankar: టైటిల్ ఇలానా పెట్టేది.. సాయిధరమ్ తేజ్ సినిమాపై నార్కొటిక్ బ్యూరో ఘాటు వ్యాఖ్యలు
మరో బీజేపీ నేత బసనగౌడ ఆర్ పాటిల్ మాట్లాడుతూ.. అన్ని మతాల సహనం, సర్వజాతుల శాంతి వచనాలు, నినాదాలు మీ ప్రసంగానికి పరిమితమా..? అని కాంగ్రెస్ని ప్రశ్నించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును సమానంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ముస్లింలు ఎక్కువ, హిందువులు తక్కు ఈ వివక్ష ఎందుకు..సందర్భాలను బట్టి మాట్లాడటం ద్వారా వీరు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గంలో వ్యవహరిస్తున్నారో లేదో చూడండి అని సూచించారు. మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వక్ఫ్ ఆస్తులకు రూ. 100 కోట్లను కేటాయించితన తర్వాత తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!